Narayana Rao Commits Suicide : బాలికపై అత్యాచారం.. చెరువులో దూకి నిందితుడు ఆత్మహత్య
Narayana Rao Commits Suicide : కాకినాడ జిల్లా తునిలో చోటుచేసుకున్న ఘోర సంఘటన స్థానికులను కలచివేసింది. 8వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడి జరిపిన నిందితుడు నారాయణరావు, పోలీసులు అరెస్టు చేసిన కొద్ది గంటల్లోనే ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది
- By Sudheer Published Date - 11:01 AM, Thu - 23 October 25

కాకినాడ జిల్లా తునిలో చోటుచేసుకున్న ఘోర సంఘటన స్థానికులను కలచివేసింది. 8వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడి జరిపిన నిందితుడు నారాయణరావు, పోలీసులు అరెస్టు చేసిన కొద్ది గంటల్లోనే ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిని నిన్న రాత్రి కోర్టుకు తరలిస్తుండగా, మధ్యలో బాత్రూం అవసరమని చెప్పి జీపు దిగాడు. కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని సమీపంలోని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో పోలీసులు, స్థానిక ప్రజలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
Cashew: కొలెస్ట్రాల్ తగ్గించుకుంటూనే ఆరోగ్యంగా బరువు పెరగాలంటే జీడిపప్పును ఇలా తీసుకోవాల్సిందే!
రాత్రి నుంచే గజ ఈతగాళ్లతో మృతదేహం కోసం గాలింపు చేపట్టగా, ఈ ఉదయం అతని మృతదేహం చెరువులో తేలియాడుతూ కనిపించింది. తుని పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు విచారణలో నిందితుడి ఆత్మహత్యతో కీలకమైన సాక్ష్యాలు దొరకకుండా పోయే అవకాశమున్నదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన మరోసారి మహిళా, బాలికల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. చట్టాలు ఉన్నా, వాటి అమలులో లోపాలు, అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, బాధితురాలికి జరిగిన అన్యాయం మాత్రం చెరగదని సామాజికవేత్తలు చెబుతున్నారు. తుని ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండగా, ప్రభుత్వం ఈ కేసుపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించి, బాధితురాలికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.