Prajadarbar : గన్నవరం నియోజకవర్గంలో నేడు యార్లగడ్డ సమక్షంలో ప్రజాదర్బార్
Prajadarbar : ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే గారికి విన్నవించుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం రెండు ప్రధాన వేదికల్లో జరగనుంది. మొదటి ప్రజాదర్బార్ ఉదయం 10:00 గంటలకు విజయవాడ
- By Sudheer Published Date - 12:03 PM, Fri - 28 November 25
గన్నవరం నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. ప్రభుత్వ విప్ మరియు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు అధ్యక్షతన ఈరోజు నవంబర్ 28, 2025 (శుక్రవారం) నాడు, ప్రజాదర్బార్ – పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే గారికి విన్నవించుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం రెండు ప్రధాన వేదికల్లో జరగనుంది. మొదటి ప్రజాదర్బార్ ఉదయం 10:00 గంటలకు విజయవాడ రూరల్ మండలం, నున్న గ్రామంలోని కో-ఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్, మొదటి అంతస్తులో ప్రారంభమవుతుంది. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.
Dwaraka Tirumala : ద్వారకాతిరుమలలో అంతరాలయ దర్శనానికి టికెట్
సాయంత్రం 04:00 గంటలకు రెండవ ప్రజాదర్బార్ కార్యక్రమం బాపులపాడు మండలం, కాకులపాడు గ్రామ కో-ఆపరేటివ్ సొసైటీ వద్ద నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కాకులపాడు గ్రామ కో-ఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన రైతులకు బోనస్ను అందజేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు ఈ ప్రజాదర్బార్లలో స్వయంగా పాల్గొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరుండి తెలుసుకొని, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి, భూ సమస్యలు, పించన్, రేషన్, హౌసింగ్, రైతు సమస్యలు వంటి అనేక ముఖ్య అంశాలపై ప్రజల వినతులను ఆయన స్వీకరించి, అక్కడికక్కడే లేదా సత్వర పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తారు.
Gram Sarpanch Elections : సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
కావున, గన్నవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్ మరియు బాపులపాడు మండలాల ప్రజలు ఈ ప్రజాదర్బార్లలో తప్పకుండా పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఎన్డీయే కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని, ఎమ్మెల్యే గారితో మాట్లాడేందుకు, తమ ప్రాంతీయ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని గౌరవ ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులవారి కార్యాలయం కోరుతోంది. ఈ ప్రజాదర్బార్ ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమంపై మరింత అవగాహన లభించే అవకాశం ఉంది.