Vijay Sai Reddy : ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తోన్న బాలిక ఆత్మహత్య
విజయవాడ కేంద్రంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం అప్పట్లో రాష్ట్రంలో సంచలనంగా ప్రాచుర్యం పొందింది.
- By CS Rao Published Date - 12:44 PM, Mon - 31 January 22
విజయవాడ కేంద్రంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం అప్పట్లో రాష్ట్రంలో సంచలనంగా ప్రాచుర్యం పొందింది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు లీడర్లు కాల్ మనీ, సెక్స్ రాకెట్ ను నడిపారు. ఆ క్రమంలో బాధితులు ఆనాడు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వైసీపీ పలు ఫిర్యాదు చేసింది. కొందరు టీడీపీలోని కీలక లీడర్లు వడ్డీ వ్యాపారం చేస్తూ పట్టుబడ్డారు. ఆనాడు ఆ వ్యవహారం రాజకీయ అస్త్రంగా మారింది. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన లీడర్ మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. ఫలితంగా ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆ మేరకు పోలీసులు కేసును నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.తెలుగుదేశం పార్టీ హయాంలో 55ఏళ్ల వృద్ధుడు పల్నాడు ప్రాంతంలోని ఒక మైనర్ పై అత్యాచారం జరిపాడు. ఆ సందర్భంగా స్థానిక ప్రజలు రోడ్డు మీదకు వచ్చి పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. పోలీసు స్టేషన్ మీద దాడికి కూడా చేశారు. ఫలితంగా ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అనివార్యంగా పోలీసులు విచారణ వేగవంతం చేయాల్సిన వచ్చింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ఆనాడు పక్కాగా మొదలు పెట్టారు. దీంతో నిందితుడు మరోమార్గం లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫలితంగా ఆ ఇష్యూ అప్పట్లో క్లోజ్ అయింది.
చంద్రబాబు ఉస్కో అనగానే స్వల్ప ఘటనలపై కూడా నానా రచ్చ చేసే బానిస పార్టీల నేతలెవరూ14 ఏళ్ల బాలిక ఆత్మహత్యపై నోరు మెదపడం లేదు. పసి పిల్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన పశువు టీడీపి నేత వినోద్ జైన్ ను బహిరంగంగా ఉరితీస్తే తప్ప ఇలాంటి ఘటనలు ఆగవు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 31, 2022
విజయవాడ కేంద్రంగా స్వర్గీయ వైఎస్ సీఎంగా ఉండగా ఆయేషా మీరా అత్యాచారం, హత్య జరిగింది. కాలేజిలోని హాస్టల్ ల్లోనే ఆ అమ్మాయిని రేప్ చేసిన హత్య చేశారు. అప్పట్లో ఆ ఇష్యూను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ తీసుకెళ్లింది. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్న వర్ల రామయ్య ప్రతి వేదికపైనా ఆయేషా మీరా పై జరిగిన అత్యాచారం, హత్య గురించి ప్రజలుకు తెలియచేయడానికి ప్రయత్నం చేశాడు. ఆయేషా మీరా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మంత్రి కుమారుడు మీద ఆరోపణలు ఉన్నాయి. ఆ మేరకు టీడీపీ కూడా ఆరోపణలు చేసింది. కానీ, ఆయేషా మీరా కేసుకు. సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు.ఇక ఇటీవల ఏపీలో మహిళలపై జరిగిన దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలపై టీడీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. మహిళా అధ్యక్షురాలిగా ఉన్న అనిత పలు వేదికలపై రాష్ట్రంలో జరుగుతోన్న అగాయిత్యాలపై ఫిర్యాదు చేయడంతో పాటు కొన్ని చోట్ల ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది. సీఎం జగన్ ఇంటికి సమీపంలో జరిగిన అత్యాచారంను అప్పట్లో టీడీపీ హైలెట్ చేసింది. తాజాగా విజయవాడలో జరిగిన బాలిక ఆత్మహత్య తెలుగుదేశం పార్టీకి చుట్టుకుంది. తొమ్మిదో తరగతి చదువుతోన్న బాలిక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత వినోద్ జైన్ ను ఆ పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసింది. మరోపక్క టీడీపీ నేతలపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
బాలిక ఆత్మహత్య ఘటనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించాడు. ‘చంద్రబాబు ఉస్కో అనగానే స్వల్ప ఘటనలపై కూడా నానా రచ్చ చేసే బానిస పార్టీల నేతలెవరూ 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యపై నోరు మెదపడం లేదని విమర్శలు కురిపించాడు. పసి పిల్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన పశువు టీడీపీ నేత వినోద్ జైన్ ను బహిరంగంగా ఉరితీస్తే తప్ప ఇలాంటి ఘటనలు ఆగవు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
సంక్రాంతి సందర్భంగా జరిగిన గుడివాడ కాసినో వ్యవహారంపై టీడీపీ వ్యూహాత్మకంగా మంత్రి కొడాలి నాని మీద దాడి చేసింది. ఆయన్ను బర్తరఫ్ చేయాలనే డిమాండ్ ను ఇప్పటికీ పలు మార్గాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఆ సమయంలోనే ఉద్యోగుల సమ్మె నోటీస్ ఇచ్చారు. దీంతో సమ్మె వైపు ప్రజల మైండ్ మళ్లింది. దాన్ని మరల్చడానికి జిల్లాల పెంపు అంశాన్ని ఏపీ సర్కార్ తెరమీదకు తీసుకొచ్చిందని ప్రత్యర్థుల ఆరోపణ. ఇప్పుడు విజయవాడ కేంద్రంగా జరిగిన బాలిక ఆత్మహత్య చుట్టూ ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. దీనికి ఎలాంటి ఫుల్ స్టాప్ పెడతారో..చూడాలి.
Tags
Related News
AP : విజయసాయిరెడ్డికి షర్మిల ప్రశ్నల వర్షం..సమాధానం చెపుతారా..?
ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల (Sharmila)..ఆ తర్వాత అధికార పార్టీ వైసీపీ (YCP) కి చెమటలు పట్టిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే..మరోపక్క అన్న జగన్ (Jagan) ఫై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి (Vijay Sai reddy)కి షర్మిల ప్రశ్నల వర్షం సంధించింది. తాజాగా సీఎం జగన్ ఆధ్వర్యంలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తమ ముందుకు వచ్చిన �