Nara Lokesh : ‘జెండా’ సభకు లోకేష్ దూరం..కారణం ఏంటో ..?
- By Sudheer Published Date - 10:44 PM, Wed - 28 February 24
జనసేన – టీడీపీ (TDP-Janasena) కూటమి గా ఎన్నికల బరిలో దిగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే ఇరు పార్టీలు తమ మొదటి జాబితాను విడుదల చేసారు. ఇక ఈరోజు తాడేపల్లిగూడెం నుండి మొదటి ఉమ్మడి సభ (TDP Janasena Janda Sabha) ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సభకు ఇరు పార్టీల నుండి దాదాపు 500 మంది నేతలు హాజరుకాగా..దాదాపు 5 లక్షల మంది అభిమానులు , ఇరు పార్టీల కార్యకర్తలు హాజరయ్యారు. సభకు వచ్చిన వారిని ఏమాత్రం నిరాశ పరచకుండా ఇరు పార్టీల నేతలు తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. ఇక చంద్రబాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు వారి వారి స్టయిల్ లో అదరగొట్టారు. మొదటి సభ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడం తో ఇరు పార్టీల్లో జోష్ పెరిగింది. అయితే ఈ సభలో ఓ లోటు కనిపించింది. అదే యువ నేత , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) హాజరు కాకపోవడం.
చంద్రబాబు జైల్లో ఉన్న క్రమంలో పవన్ వెంట నడిచిన లోకేష్..ఆ తర్వాత ఎక్కడ ఇరువురు కనిపించిన దాఖలు పెద్దగా కనిపించలేదు. పవన్ – చంద్రబాబు మద్యే పొత్తుల వ్యవహారం , అభ్యర్థుల ఎంపిక , ప్రకటన జరిగాయి..ఆ సందర్భాలలో ఎక్కడ కూడా లోకేష్ కనిపించలేదు. ఇక ఈరోజు మొదటి ఉమ్మడి సభలో కూడా లోకేష్ కనిపించకపోయేసరికి అందరిలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ తో ఉన్న విభేదాలే దీనికి కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు బయటకు రావడం మొదలయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
జనసేనతో అధికారాన్ని పంచుకునే విషయంలో గతంలో నారా లోకేష్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వస్తే అయిదు సంవత్సరాల పాటు చంద్రబాబే సీఎంగా ఉంటారంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో జనసేన నుండి కాస్త ఘాటైన విమర్శలే వచ్చాయి. జగన్ ను గద్దె దించడమే మొదటి లక్ష్యం కావాలని, అధికారాల పంపిణీ గురించి మాట్లాడుకోవడానికి సరైన సమయం కాదంటూ ..నారా లోకేష్ను ఉద్దేశించి పరోక్షంగా పవన్ చురకలు అంటించారంటూ వార్తలు వచ్చాయి. అప్పటి నుండే ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు ఇప్పుడు అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నిజంగా ఆ విభేదాలే కారణమా..లేక మరేదైనా ఉందా..అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సభ ఫై వైసీపీ నేతలు తమ మాటలకు పని చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. రేపటి నుండి మీడియా లో వారి హడావిడి మొదలు కాబోతుంది కావొచ్చు. ఇప్పటికే మంత్రి అంబటి ట్విట్టర్ వేదికగా స్పందించడం కూడా జరిగింది.
Read Also : Pawan Kalyan : నాతో స్నేహం అంటే చచ్చేదాక – పవన్ కళ్యాణ్
Related News
Nara Lokesh: ఏపీ సంక్షేమం కోసమే ప్రజాగళం కూటమి ఏర్పాటు
Nara Lokesh ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో కూటమి ఆధ్వర్యాన బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో కలిసి యువనేత రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… తిరుపతి అంటే అమర్ రాజా, అమర్ రాజా అంటే తిరుపతి. అలాంటి కంపెనీపై వేధింపులకు పాల్పడ్డారు. దీంతో వారు పక్క రాష్ట్రానికి వెళ్లి తమ ప్లాంట్ ను ఏర్పాటుచేసుకున్నారు. ఆ ఒక్క నిర్ణయం వల్ల ఇక్కడ 20వేల మంది ఉద్యోగాలు కో�