HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Land Mafia By Electronic Media Reporters In Ananthapur

Media Land Mafia : రూ. 14కోట్ల `మీడియా దందా`లోని పెద్ద‌లు ఎవ‌రు?

ప్ర‌స్తుతం తెలుగు మీడియా `బ్లూ, ఎల్లో, పింక్, బ్లాక్` గా విడిపోయింద‌ని చాలా కాలంగా రాజ‌కీయ పార్టీల నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. బ్లూ మీడియా గురించి టీడీపీ నేత‌లు త‌ర‌చూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతుంటారు. అంతే వేగంగా ఎల్లో మీడియాపై వైసీపీ నేత‌లు డైలీ విరుచుకుప‌డుతుంటారు.

  • Author : CS Rao Date : 25-08-2022 - 12:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Blue Media
Blue Media

ప్ర‌స్తుతం తెలుగు మీడియా `బ్లూ, ఎల్లో, పింక్, బ్లాక్` గా విడిపోయింద‌ని చాలా కాలంగా రాజ‌కీయ పార్టీల నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. బ్లూ మీడియా గురించి టీడీపీ నేత‌లు త‌ర‌చూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతుంటారు. అంతే వేగంగా ఎల్లో మీడియాపై వైసీపీ నేత‌లు డైలీ విరుచుకుప‌డుతుంటారు. అంతేకాదు, దుష్ట‌చ‌తుష్ట‌యం అంటూ ఎల్లో మీడియా మీద ప్లీన‌రీ వేదిక‌గా తీర్మానం కూడా చేశారు. ఇక‌, కేసీఆర్ అండ్ టీమ్ చేతుల్లోని ఛాన‌ళ్లు, ప‌త్రిక‌ల‌ను పింక్ మీడియాగా కాంగ్రెస్ చెబుతోంది. జీతాలు ఇవ్వ‌కుండా `బ్లాక్ మెయిల్` చేస్తూ బ‌త‌కాల‌ని విలేక‌రుల‌కు చెప్పే మీడియా హౌస్ లు చాలానే ఉన్నాయి. ఇటీవ‌ల అక్రిటేష‌న్లు రూ. 20 నుంచి రూ. 70వేల వ‌ర‌కు బ‌హిరంగంగా అమ్ముకున్న యాజ‌మాన్యాల కింద ఉన్న మీడియా ను `బ్లాక్ ` లేదా `పిచ్చ‌` మీడియాగా రాజ‌కీయ పార్టీల నేత‌లు మూకుమ్మ‌డిగా విమ‌ర్శించే స్థాయికి దిగ‌జారింది మీడియా. వాళ్లు చేసే విమ‌ర్శ‌ల‌కు బ‌ల‌చేకూరేలా అనంత‌పురం కేంద్రంగా దొర‌లు మాదిరిగా ఇంత‌కాలం తిరిగిన దొంగ విలేక‌రుల దందా బ‌య‌ట‌ప‌డింది. అయితే, ఆయా మీడియా హౌస్ ల్లోని పెద్ద‌ల స‌హ‌కారం లేకుండా కేవ‌లం విలేక‌రులు ఇంత‌ పెద్ద దందా చేయ‌గ‌ల‌రా? అనేది ఇప్పుడు తాజాగా జ‌రుగుతోన్న చ‌ర్చ.
అనంత‌పురం జిల్లాలో ఓ భారీ అక్ర‌మ భూ దందా వెలుగులోకి వ‌చ్చింది. ఈ దందాను ముగ్గురు విలేక‌రులు న‌డిపార‌ని పోలీసులు గ‌మ‌నించారు. వాళ్ల‌కు తోడుగా ఓ డ్రైవ‌ర్ సహ‌కారం ఉంద‌ని గుర్తించి వాళ్ల‌ను అరెస్ట్ చేయ‌డంతో దందా బ‌హిర్గ‌తం అయింది. స్థానిక కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా ఆ న‌లుగురికి న్యాయ‌మూర్తి రిమాండ్ విధించారు. ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ అధికారిక సోష‌ల్ మీడియాల వ‌రుస ట్వీట్ల ను చేస్తోంది.

పోలీసుల వివ‌రాల ప్ర‌కారం భూ దందాకు నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి వాటిని ఉప‌యెగించారు. వాటి ఆధారంగా 14.96 ఎకరాల భూమిని య‌జ‌మానికి తెలియ‌కుండా మరొకరికి విక్రయించారు. అంతేకాదు, ప‌క్కాగా కొనుగోలుదారుడి పేరిట‌ రిజిస్ట్రేషన్ కూడా చేయించ‌డం హైలెట్ పాయింట్‌. ఈ కేసును పోలీసులు విచారణ చేస్తే టీవీ-9 విలేఖరి లక్ష్మికాంత్ రెడ్డి, అతని డ్రైవర్, స్థానిక ఎన్టీవీ మరియు సాక్షి విలేఖర్లు పాత్ర‌ధారులుగా తేలింది. ఆ విష‌యాన్ని పోలీసులు బ‌య‌ట‌పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలతో ప్రతి రోజూ వెలువడుతోన్న తెలుగుదేశం e-పేపర్ ను చదవండి… చదివించండి. (5/5)#TeluguDesamEpaper #tdpepaper pic.twitter.com/IKmyWzvmti

— Telugu Desam Party (@JaiTDP) August 25, 2022

దందా వెనుక సూత్ర‌ధారులుగా ఉన్న ఆయా మీడియాల్లోని కొంద‌రు పెద్ద‌ల ప్ర‌మేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారం నడిపేందుకు రూ.14 కోట్లకు డీల్ కుదుర్చుకోగా, ఇప్పటికే రూ.75 లక్షలు చేతులు మారాయ‌ని టీడీపీ సోషల్ మీడియా వెలుగెత్తి చాటుతోంది. ప్ర‌స్తుతం బ్లూ మీడియాను ప‌ట్టుకున్న టీడీపీ నానా యాగీ చేస్తోంది. ప్ర‌తిగా ఎల్లో మీడియా వ్య‌వ‌హారాల‌పై ఇప్పుడు వైసీపీ దృష్టి పెట్టిందట‌. పింక్ మీడియాను కాంగ్రెస్ లోని కొంద‌రు నేత‌లు త‌ప్ప ఎవ‌రూ ఎదిరించే ప‌రిస్థితి లేద‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. ఇక నాలుగో ర‌కం బ్లాక్ అలియాస్ పిచ్చి మీడియా యాజ‌మాన్యం స‌మాజాన్ని పీక్కుతినే ప‌నిలో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాలు లైట్ గా తీసుకోవ‌డం గ‌మనార్హం.
మొత్తం మీద 14కోట్ల డీల్ ను సెట్ చేసిన విలేక‌రుల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ల వెనుక పాత్ర‌దారులుగా ఉన్న పెద్ద‌ల‌ను వెలిగితీస్తారా? లేదా అనేది చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ananthapur
  • land mafia
  • reporters
  • telugu desam party

Related News

CM Chandrababu: Good news for AP students – 4% interest subsidy on education loans.

CM Chandrababu: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రుణాలపై వడ్డీలో నాలుగు శాతం రాయితీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. దేశ, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఉన్

  • government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

    Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd