HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >If You Do These Three Things You Will Get Rs 15000

Thalliki Vandanam : ఈ మూడు పనులు చేస్తేనే రూ.15వేలు..లేదంటే అంతే సంగతి !!

Thalliki Vandanam : విద్యార్థికి కనీసం 75% హాజరు ఉండాలి. వార్షిక కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితికి లోబడే ఉండాలి

  • Author : Sudheer Date : 11-06-2025 - 5:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thallivandanam Update
Thallivandanam Update

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” (Thalliki Vandanam) పథకం రేపటి నుంచి ప్రారంభంకానుంది. సూపర్ సిక్స్ (Super Six ) హామీల్లో భాగంగా తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే ఈ నిధులు ఖాతాల్లోకి జమ కావాలంటే మూడు ముఖ్యమైన ప్రక్రియలను తప్పనిసరిగా పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.

హౌస్ హోల్డ్ డేటా, ఈకేవైసీ, NPCI లింకింగ్ తప్పనిసరి

మొదటగా, తల్లి మరియు విద్యార్థి వివరాలు హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో నమోదు అయి ఉండాలి. అలా చేయని వారు తక్షణమే స్థానిక అధికారులను సంప్రదించి నమోదు చేయించుకోవాలి. రెండవది, తల్లి బ్యాంక్ ఖాతా ఈకేవైసీ (eKYC) పూర్తిగా చేయాలి. దీనివల్ల బ్యాంక్ అకౌంట్ ప్రామాణికత గుర్తింపు సాధ్యం అవుతుంది. మూడవది, తల్లి అకౌంట్ NPCI (National Payments Corporation of India) తో లింక్ అయి ఉండాలి. ఆధార్ లింకింగ్ ద్వారా లబ్ధిదారుల నిర్ధారణ సులభమవుతుంది. ఈ మూడు ప్రక్రియలు పూర్తయ్యే వరకు డబ్బులు ఖాతాల్లో జమ చేయబడవు.

అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు

ఈ పథకం ప్రయోజనం పొందాలంటే విద్యార్థి తప్పకుండా ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలలో చదవాలి. తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి. విద్యార్థికి కనీసం 75% హాజరు ఉండాలి. వార్షిక కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితికి లోబడే ఉండాలి. అవసరమైన డాక్యుమెంట్లలో విద్యార్థి స్టడీ సర్టిఫికెట్, తల్లి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, నివాస ధ్రువీకరణ పత్రం లేదా రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ సర్టిఫికెట్ (అవసరమైతే) మరియు పాఠశాల హాజరు సర్టిఫికెట్ ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ అర్హతలు నెరవేర్చిన వారు మాత్రమే “తల్లికి వందనం” ప్రయోజనాన్ని పొందగలుగుతారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం వర్తింప చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, మొత్తం 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రేపు రూ. 8,745 కోట్లు జమ చేయనుంది. 1వ తరగతిలో చేరిన విద్యార్థులు, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరిన విద్యార్థుల తల్లులు కూడా ఈ పథకం నుంచి లబ్ధి పొందనున్నారు. ఇంకా అడ్మిషన్ ప్రక్రియ పూర్తికాని విద్యార్థుల వివరాలు లభించగానే, వారి తల్లుల ఖాతాల్లోనూ నిధులు జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

93% విద్యార్థులకు లబ్ధి – జీ.ఓ విడుదల

ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల్లో 93 శాతం మంది తల్లులకు ప్రభుత్వం నేరుగా ఆర్థిక సాయం అందజేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 79 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ వరకు చదువుతుండగా, వారిలో 67 లక్షల మందికి పైగా విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తింప చేస్తారు. మిగిలిన 7 శాతం విద్యార్థులు అత్యున్నత ఆదాయ వర్గానికి చెందినవారు కావడంతో వారికి పథకం వర్తించదు. పథకానికి సంబంధించిన విధివిధానాలను స్పష్టపరుస్తూ నేడు సంబంధిత అధికారుల ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులు (జీ.ఓ) విడుదల చేయనున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 వంటి పథకాలను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Qualifications and required documents
  • Thalliki Vandanam
  • Thalliki Vandanam Scheme

Related News

Fiber Net Case Against Cm C

AP Fibernet Case : చంద్రబాబు కు ఆ దిగులు అవసరం లేదు !!

AP Fibernet Case : 2021 సెప్టెంబర్‌లో ఈ కేసు నమోదైంది. దీనిలో ప్రధాన ఆరోపణలు.. ఫైబర్‌నెట్ ప్రాజెక్టు ఫేజ్-1 టెండర్లలో అక్రమాలు జరిగాయని. టెర్రా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.321 కోట్లకు పైగా ఆయాచిత లాభం చేకూర్చారని

  • Chandrababu Naidu Lays Foun

    Vizag : వైజాగ్ లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు

  • Ap Cabinet Meeting Dec 11

    AP Cabinet Decisions : ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు

Latest News

  • అరటిపండు తింటే లాభమా నష్టమా..డాక్టర్ చెప్పిన రహస్యాలు ఇవే

  • సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • ‘వీబీ జీ రామ్‌ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

  • రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

  • తిరిగి సాధారణ స్థితికి ఇండిగో కార్యకలాపాలు.. సీఈఓ ప్రకటన

Trending News

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd