Janasena : పవన్కు షాక్ ఇచ్చిన ఈసీ స్క్వాడ్
ఉప్పాడ-కొత్తపల్లిలోని సురక్ష ఆసుపత్రికి చెందిన హాలులో మత్స్యకార మహిళా సభకు సిద్ధమయ్యారు. అదే సమయంలో ప్లయింగ్ స్క్వాడ్ వచ్చి పవన్ సభకు అనుమతిలేదని తేల్చిచెప్పారు
- By Sudheer Published Date - 04:51 PM, Wed - 3 April 24
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి జనసేన సత్తా నిరూపించుకోవాలని..అసెంబ్లీ లో తాను కూడా అడుగుపెట్టాలని అనేక ప్రణాళికలు రచిస్తుంటే..ఆ ప్రణాళికలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మొన్న వారాహికి పిఠాపురం కుక్కుటేశ్వర ఆలయంలో పూజలకు అనుమతి లేకపోవడం జరిగితే తాజాగా ఉప్పాడలోని సురక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన మత్స్యకార మహిళల సభను ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ (Flying Squad) అడ్డుకోవడంతో జనసేనానికి మరో షాక్ తగిలినట్లు అయ్యింది.
ప్రచారంలో భాగంగా జనసేనని నాల్గు రోజులుగా పిఠాపురం లో పర్యటిస్తూ వస్తున్నారు. కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల్లో మంగళవారం పవన్ పర్యటించారు. మహిళలు, రైతులు, కార్మికులు, యువత.. ఇలా వివిధ వర్గాల వారిని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వారితో కూర్చుని వారికి ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ప్రజల సమస్య లు పరిష్కరిస్తానని, నియోజవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ముందుకు సాగారు. ‘అన్నా బాగున్నారా.. మా వీధికి రా అన్నా.. మా ఇంటికి రా అన్నా..’ అంటూ మత్స్యకారులు, ఎస్సీ మహిళలు, గ్రామీణులు ఆత్మీయంగా ఆహ్వానిస్తుంటే కాదనలేక ఆయన ప్రతి గడప దగ్గరా ఆగారు. ఆరుబయట మంచాల పైన, గుమ్మాల దగ్గర కాసేపు కూర్చుని జనసేనాని జనంతో ఆప్యాయంగా మమేకం అయ్యారు. ఇసుకపల్లి- నాగులపల్లి రోడ్డులో కొబ్బరి బొండాలు అమ్మే తాతబ్బాయి దగ్గర కాసేపు కూర్చుని సమస్యలు విన్నారు. ‘ఎమ్మెల్యేగా గెలిచాక నాకు ఇల్లు కట్టివ్వాలి’ అని తాతబ్బాయి కోరారు. పొన్నాడలో సపోటా తోటల వద్ద కౌలు రైతులతో మాట్లాడారు. వరి పొలాలు పరిశీలించారు. మత్స్యకారుడు ఏడిది శేషు ఇంటి దగ్గర నులక మంచంపై కూర్చుని ముచ్చటించారు. కొత్తగా పెళ్లైన మణికంఠస్వామి, అన్నపూర్ణలకు పవన్ కల్యాణ్ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
అనంతరం ఉప్పాడ-కొత్తపల్లిలోని సురక్ష ఆసుపత్రికి చెందిన హాలులో మత్స్యకార మహిళా సభకు సిద్ధమయ్యారు. అదే సమయంలో ప్లయింగ్ స్క్వాడ్ వచ్చి పవన్ సభకు అనుమతిలేదని తేల్చిచెప్పారు. పిఠాపురం ఇన్ఛార్జి ఉదయ్ శ్రీనివాస్ ద్వారా విషయాన్ని పవన్కు చేరవేశారు. ప్లయింగ్ స్క్వాడ్ అధికారి రేబాక వరప్రసాద్ పవన్కు వివరంగా ఎన్నికల నిబంధనలు చెప్పడంతో పవన్ స్వయంగా సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పవన్ ఎండపల్లి జంక్షన్ , కొండెవరం నవఖండ్రవాడ మీదుగా పిఠాపురం చేరుకున్నారు.
ఇదిలా ఉంటె ప్రస్తుతం పవన్ తీవ్ర జ్వరం తో బాధపడుతున్నారు. పిఠాపురం ప్రచారంలో ఆయనకు వడదెబ్బ తగిలిందని. దీంతో ఈ రోజు జరగాల్సిన తెనాలి పర్యటన తో పటు రేపు నెల్లిమర్లలో జరగాల్సిన పర్యటన కూడా వాయిదా పడినట్లు సమాచారం.
Read Also ; Summer Tips: వేసవిలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?
Related News
Big Relief to Janasena : ఊపిరి పీల్చుకున్న జనసేన..ఇక ఆ టెన్షన్ అవసరం లేదు
జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లో, అలాగే జనసేన పోటీలో ఉన్న లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయిస్తున్నామని, స్వతంత్రులకు ఇవ్వడం లేదని ఈసీ తన నివేదికలో స్పష్టం చేసింది