HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Naidu With Isb Hyderabad

Chandrababu ISB : `ఐఎస్ బీ` చ‌రిత్ర‌లో చంద్ర‌బాబు

హైద‌రాబాద్‌కు ఐఎస్బీ ఎలా వ‌చ్చింది? 20ఏళ్ల క్రితం ప్రారంభించిన ఆ సంస్థ స్నాత‌కోత్స‌వాల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్న త‌రుణం ఇది.

  • By CS Rao Published Date - 12:12 PM, Thu - 26 May 22
  • daily-hunt
CBN ISB
Chandrababu Isb

హైద‌రాబాద్‌కు ఐఎస్బీ ఎలా వ‌చ్చింది? 20ఏళ్ల క్రితం ప్రారంభించిన ఆ సంస్థ స్నాత‌కోత్స‌వాల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్న త‌రుణం ఇది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌స్తున్న క్ర‌మంలో ఒక‌సారి ఐఎస్బీ పుట్టుపూర్వోత్త‌రాల‌ను అవ‌లోక‌నం చేసుకుంటే చంద్ర‌బాబు విలువ తెలుగు ప్ర‌జ‌ల‌కు తెలుస్తుంది. ఐఎస్ బీని ఏర్పాటు చేసి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ కు ఎలా వచ్చిందన్న విషయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

దేశంలోని టాప్ పారిశ్రామికవేత్తలంతా కలిసి అత్యుత్తమ బిజినెస్ స్కూల్ పెట్టాలని నెల‌కొల్పాల‌ని యోచించారు. మానవ వనరుల ఉత్పత్తి కేంద్రంగా ఉండ‌డంతో పాటు దేశానికి త‌ల‌మానికంగా ఉండాల‌ని త‌ల‌పోశారు. అందులో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను(ఐఎస్ బీ) ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. ఆ రోజుల్లో వారు బెంగళూరులో ఐఎస్బీని ప్రారంభించాల‌ని తొలుత‌ భావించారు. అందుకోసం ఏర్పాట్లు పూర్తి చేయటమే కాదు, ఆనాడున్న కర్ణాటక ముఖ్యమంత్రి పాటిల్ ను కలిసి నిర్ణయాన్ని తెలియ‌చేయాల‌ని టాప్ ఇండిస్ట్రియ‌లిస్ట్ లు నిర్ణయించారు. అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారు.

ఆ విషయం తెలుసుకున్న ఆనాటి ఉమ్మ‌డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక దిగ్గజాలను హైదరాబాద్ కు బ్రేక్ ఫాస్ట్ కు రావాలని రిక్వెస్ట్ చేశారు. “మీరు కోరుకున్నట్లుగా బెంగళూరులోనే ఐఎస్ బీని పెట్టండి. కానీ అక్క‌డ‌కి వెళ్లేటప్పుడు హైదరాబాద్ కు వచ్చి బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్లాలని కోరారు. అందుకు పారిశ్రామికవేత్త పెద్ద ఆసక్తి చూపించలేదు. ఆ టైంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల డైరెక్టర్ లో ఒకరైన శీనిరాజును సంప్రదించిన చంద్రబాబు , పారిశ్రామికవేత్తల్ని హైదరాబాద్ కు వచ్చేలా చూడాలని కోరారు.

అప్పట్లో హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబు ఇమేజ్ ప్ర‌పంచానికి తెలుసు. అదే పనిగా బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని అభ్య‌ర్థిస్తోన్న తీరును కాదనలేక వస్తామని పారిశ్రామిక‌వేత్త‌లు హామీ ఇచ్చారు. ఆ మేర‌కు అందరూ హైదరాబాద్ కు బ్రేక్ ఫాస్ట్ కు వచ్చారు. వారందరికి చంద్ర‌బాబు కొసరికొసరి వడ్డించి. వారు స్టార్ట్ చేయబోయే విద్యా సంస్థ గురించి వివరాలు అడిగారే త‌ప్ప హైద‌రాబాద్‌ లో పెట్టాలని వారిని ఇబ్బందికి గురి చేయలేదు. బ్రేక్ ఫాస్ట్ ముగిసిన తర్వాత వారంతా ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు తమ కార్ల వద్దకు వెళ్లగా, చంద్రబాబు స్వయంగా ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త కారు వద్దకు వెళ్లి వ్యక్తిగతంగా వారికి వీడ్కోలు పలికారు.

సీన్ కట్ చేస్తే, హైదరాబాద్ నుంచి స‌దరు పారిశ్రామికవేత్తలు బెంగుళూరు వెళ్లారు. ఆ రాష్ట్ర సీఎం ఇచ్చిన టైంకు ఆయ‌న ఛాంబ‌ర్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. కానీ, వేరు పనుల్లో బిజీగా ఉన్న క‌ర్ణాట‌క సీఎం దాదాపు దాదాపు మూడు గంటల పాటు పారిశ్రామిక‌వేత్త‌ల‌ను వెయిట్ చేయించారు. దీంతో, వారంతా ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకొని , శీనిరాజుకు ఫోన్ చేశారు. `బెంగళూరులో పెట్టాలనుకున్న బిజినెస్ స్కూల్ ను హైదరాబాద్ లో పెట్టాలనుకుంటున్నాం అంటూ స‌మాచారం ఇచ్చారు. మా నిర్ణయాన్ని సీఎం చంద్రబాబుకు తెలియజేయండన్నారు.` రాలేమని చెప్పిన బ్రేక్ ఫాస్ట్ కు రప్పించి , వారికి అతిధి మర్యాదలు చేయటం ద్వారా మనసు దోచుకున్న చంద్రబాబు హైదరాబాద్ మణిహారంలో ఒక మణి లాంటి ఐఎస్ బీని తీసుకొచ్చారు. ఇదంతా ఆనాటి ప్ర‌తిప‌క్షాల‌కు కూడా తెలుసు. ఆనాడు ఉమ్మ‌డి సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ఐఎస్ బీ కోసం చేసిన ప్ర‌య‌త్నం ఎవ‌రూ కాద‌న‌లేరు. ప‌చ్చి వాస్త‌వ‌మ‌ని ఏ పారిశ్రామిక‌వేత్త‌ను అడిగినా చెబుతారు. విజన్ ఉన్న నేత ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటే ఏం జరుగుతుందన్న విషయం ఐఎస్ బీ చరిత్రలోకి వెళితే తెలుస్తోంది. త‌రాలు మారినా మ‌రువ‌లేని ఐఎస్ బీ చ‌రిత్ర‌లో చంద్ర‌బాబు పాత్ర న‌భూతోన‌భ‌వ్యిష‌త్‌.!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • isb hyderabad
  • pm modi
  • TDP chandrababu naidu

Related News

PM Modi

PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

PM Modi : ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వేగం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 13వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు

  • PM Modi

    PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

Latest News

  • No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. రోడ్డెక్కిన వేలాది మంది ప్ర‌జ‌లు!

  • ‎Money Plant: ఏంటీ.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

  • ‎Hair Growth: ఈ ఒక్క పువ్వుతో మీ జుట్టు గడ్డిలా ఏపుగా పెరగడం ఖాయం.. ఇంతకీ ఆ పువ్వు ఏదో తెలుసా?

  • ‎Reduce belly Fat: రోజు పడుకునే ముందు ఇది రెండు చెంచాలు తాగి పడుకుంటే చాలు.. పొట్ట ఐస్ లా కరిగిపోవడం ఖాయం!

  • ‎Karthika Masam 2025: కార్తీకమాసంలో దీప దానం ఎందుకు చేస్తారు.. దాని ప్రముఖ్యత ఏంటో తెలుసా?

Trending News

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd