HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Botsa Laxman Rao Ready To Joins Janasena

Botsa Laxman Rao : జనసేన లోకి బొత్స సొదరుడు..?

Botsa Laxman Rao : బొత్స ఫ్యామిలీలో అంతర్గత చిచ్చు మొదలుకావడం తో..జనసేనలోకి చేరాలని లక్ష్మణరావు డిసైడ్ అయ్యాడట

  • By Sudheer Published Date - 02:15 PM, Wed - 25 September 24
  • daily-hunt
Botsa Laxman Rao Ready To J
Botsa Laxman Rao Ready To J

Botsa Laxman Rao Ready To Joins Janasena : వైసీపీ నేతల (YCP Leaders) దారి ‘జనసేన కే’..అని తెలుస్తుంది. ఒకరి తర్వాత ఒకరు మీము చేరుతున్నాం అంటూ ప్రకటిస్తున్నారు. మొన్నటి వరకు 21 మంది తో ఉన్న గ్లాస్ (Janasena)..త్వరలో 100 దాటేలా ఉందని అంత మాట్లాడుకుంటున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (Jagan) కు వరుస షాకులు ఇస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన దెబ్బకు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జగన్ కు (Jagan)..ఇక ఇప్పుడు పార్టీ నేతలు ఇస్తున్న షాకులకు ఏంచేయాలో కూడా అర్ధం కానీ పరిస్థితికి వెళ్లిపోయాడు. ఎన్నికలకు ముందే కాదు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వరుసపెట్టి నేతలు బయటకు వస్తున్నారు. ఈ మధ్య చాలామంది నేతలు వైసీపీ కి రాజీనామా చేసి , టీడీపీ లో చేరగా..ఇక ఇప్పుడు జనసేన దారిపడుతున్నారు. రీసెంట్ గా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన లో చేరబోతున్నట్లు ప్రకటించగా..ఇప్పుడు బొత్స సోదరుడు సైతం జనసేన లో చేరేందుకు సిద్దమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు (Botsa Laxman Rao) పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ, సోదరుడితో ఉంటే లైఫ్ ఉండదని భావించారో ఏమో తెలీదుగానీ, ఫ్యాన్ పార్టీకి దూరం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అక్టోబరు మూడున జనసేన పార్టీలోకి చేరాలని డిసైడ్ అయ్యాడట..ఇప్పటీకే తన అనుచరులకు ఈ విషయాన్ని తెలిపాడని సమాచారం.

2019 ఎన్నికల్లో వైసీపీ విజయనగరం జిల్లా క్లీన్ స్వీప్ చేయడానికి బొత్స సత్తిబాబు ఫ్యామిలీ ఎంతో కృషి చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. తమ్ముడు అప్పలనరసయ్య, లక్ష్మణరావు మేనల్లుడు చిన్న శ్రీను ఎవరి ప్రయత్నాలు వారు చేశారు సక్సెస్ అయ్యారు. బొత్స మంత్రి కాగా, అప్పల నర్సయ్య ఎమ్మెల్యే అయ్యాడు, మేనల్లుడు జెడ్పీ ఛైర్మన్ అయ్యారు. 2024 ఎన్నికల తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. బొత్స ఫ్యామిలీలో అంతర్గత చిచ్చు మొదలుకావడం తో..జనసేనలోకి చేరాలని లక్ష్మణరావు డిసైడ్ అయ్యాడట. ఇప్పుడు చేరితే వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలనే ఆలోచన ఆయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. మరోపక్క విశాఖపట్నంలో కూడా వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, ఉడా మాజీ ఛైర్మన్‌ ఎస్‌ఏ రెహ్మాన్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను జగన్‌కు పంపారు. ముస్లింల ప్రయోజనాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం మంచి అడుగులు వేస్తోందని ప్రశంసించారు. గత వైసీపీ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఇలా మొత్తం మీద వైసీపీ నేతలంతా బయటకు వాస్తు తమ రాజకీయ భవిష్యత్ ప్లాన్ చేసుకుంటున్నారు.

Read Also : Air Travel : 50 నిమిషాలు పెరగనున్న ఫ్లైట్ జర్నీ టైం.. ఎందుకు ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Botsa Laxman Rao
  • Botsa Satyanarayana brother
  • Janasena

Related News

    Latest News

    • Nagula Chavithi 2025 : కార్తీక్ మాసంలో నాగల చవితి ఏ రోజు చేసుకోవాలి..!

    • Inter Exams: తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారు! ఈసారి వారం ముందుగానే

    • Akhanda 2: ‘అఖండ 2’లో బాలకృష్ణ డ్యూయల్ రోల్.. ఎమ్మెల్యేగా కూడా కనిపించనున్నారా?

    • AUSvIND: మూడో వన్డే కోసం ఎడ్వ‌ర్డ్స్.. టీ20లలో మ్యాక్స్‌వెల్‌

    • TVK Vijay: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ మళ్లీ రాష్ట్ర పర్యటనకు!

    Trending News

      • Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!

      • Justice Surya Kant: సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాని న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. ఎవ‌రీయ‌న‌?

      • Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?

      • Kaveri Travels : బస్సు ప్రమాదం.. హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్

      • HDFC స్కీమ్.. రూ.10 వేల తో రూ.37 లక్షలు..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd