Raksha Bandhan Mantra : కుడిచేతికే రాఖీ ఎందుకు కడతారు? రక్షాబంధన్ మంత్రం ఏమిటి ?
Raksha Bandhan Mantra : రాఖీ పండుగను ఇవాళ (ఆగస్టు 30) ఉదయం 10 గంటల 33 నిమిషాల నుంచి రేపు (ఆగస్టు 31) ఉదయం ఉదయం 8 గంటలవరకు జరుపుకోవచ్చు.
- By Pasha Published Date - 07:40 AM, Wed - 30 August 23
Raksha Bandhan Mantra : రాఖీ పండుగను ఇవాళ (ఆగస్టు 30) ఉదయం 10 గంటల 33 నిమిషాల నుంచి రేపు (ఆగస్టు 31) ఉదయం ఉదయం 8 గంటలవరకు జరుపుకోవచ్చు. సాధారణంగానైతే పండుగల నిర్వహణ కోసం సూర్యోదయానికి ఉన్న తిథిని లెక్కలోకి తీసుకుంటారు. వాటి లెక్కన ఈసారి రాఖీ పండుగను గురువారం రోజు జరుపుకోవాలని పంచాంగ కర్తలు నిర్ణయించారు. అయితే ఈ ఫెస్టవల్ ను ఈ రోజు సాయంత్రం కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
రక్షా బంధన్ మంత్రం తెలుసా ?
‘‘యేన బద్ధో బలి రాజా.. దానవేంద్రో మహాబలః..
తేనత్వామభిబధ్నామి రక్షే.. మా చలమాచల..’’
ఇక ఈ మంత్రంలోకి (Raksha Bandhan Mantra) వెళితే.. ‘ఎంతో బలవంతుడైన బలిచక్రవర్తినే అలనాడు బంధించిన విష్ణుశక్తితో ఉన్న రక్షాబంధనాన్ని నీకు కూడా కడుతున్నాను. దీని అపార శక్తితో నువ్వు కలకాలం చల్లగా ఉండాలి’ అనే మీనింగ్ వస్తుంది. ప్రహ్లాదుడి మనవడు, రాక్షస రాజు బలి చక్రవర్తి ఆగడాలతో జనం, దేవతలు బాగా ఇబ్బందిపడ్డారు. ఆ టైంలో అందరినీ రక్షించడానికి శ్రీమహావిష్ణువు వామనుడి రూపంలో భూమిపైకి వచ్చారు. బలిచక్రవర్తిపై కలిగిన అభిమానంతో అతడి రాజ్యంలోనే శ్రీ మహా విష్ణువు ఉండిపోతాడు. దీంతో శ్రీ మహాలక్ష్మి బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణ పౌర్ణమి రోజున బలి చక్రవర్తి చేతికి రక్షాబంధన దారాన్ని కట్టి తానెవరో చెబుతుంది. తన భర్తని తిరిగి వైకుంఠానికి పంపాలని బ్రాహ్మణ యువతి రూపంలో ఉన్న మహాలక్ష్మి కోరుతుంది. అందుకే ఈ శ్లోకాన్ని రీడ్ చేస్తూ సోదరులకు రాఖీ కట్టాలని పండితులు సూచిస్తున్నారు.
Also read : Railway Recruitment 2023: రైల్వే శాఖలో 2 వేల కంటే ఎక్కువ పోస్టులకు రిక్రూట్మెంట్.. దరఖాస్తు చేసుకోండిలా..!
కుడిచేతికి రాఖీ కడితే ఏం జరుగుతుందంటే.. ?
హిందూమతం ప్రకారం.. ఎడమ చేతికి చెడు అనే అర్థం ఉంది. దాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు. ఇది మూఢ నమ్మకం అని కొందరు అనుకుంటారు కానీ దీనికి ఆధ్యాత్మికం, సైన్స్ పరంగానూ ఎన్నో కారణాలున్నాయి. ఎడమచేతిని శరీరాన్ని శుభ్రపరిచే పలు పనుల కోసం వినియోగిస్తామనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ లెక్కన ఎడమ చేతి వైపు అనేది అపసవ్య దిశ.. అటు నుంచి నెగెటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుందని నమ్ముతారు. కుడివైపు అనేది సవ్యదిశ.. అటు దిక్కు నుంచి పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుందని విశ్వసిస్తారు. కుడిచేతికి రాఖీ కట్టగానే.. రాఖీ కట్టే భాగంలోని ఇడా, పింగళ, సుషుమ్న అనే మూడు నాడులు స్పందిస్తాయని, ఫలితంగా వాత, పిత్త, కఫ నియంత్రణ జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటిలో పింగళ నాడి అనేది పురుషత్వంతో సంబంధం కలిగి ఉంటుందని అంటుంటారు.
గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.
Tags
Related News
Raksha Bandhan : ఆ 60 గ్రామాలు ‘రక్షా బంధన్’ కు దూరం..ఎందుకో తెలుసా..?
ఆ గ్రామంలో ఓ జమిందార్ ఉండేవాడట ఆయనకు కొడుకులు తప్ప కుమార్తెలు లేరు. ఓ ఏడాది రాఖీ పండుగ రోజు ఆ గ్రామంలో ఉన్న పేదింటి ఆడపిల్లల్ని తీసుకొచ్చి రాఖీ కట్టించుకుని