Gyanvapi Case : శివలింగాన్ని పరిరక్షించాలన్న ఆదేశాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు..!!
- By hashtagu Published Date - 04:57 PM, Fri - 11 November 22
వారణాసిలో జ్ఞానవాపి మసీదులో శివలింగం కనుగొన్న ప్రాంతం భద్రతను పెంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఈ భద్రతను పెంచాలని ప్రధాన న్యాయమూర్తి డి. వై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పి.ఎస్. శుక్రవారం స్పష్టం చేశారు. మే 17 న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులకు తదుపరి ఉత్తర్వులు వెలవడే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ మాట్లాడుతూ..మధ్యంతర ఉత్తర్వులపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ ప్రాంతానికి భద్రత కల్పించే ఉత్తర్వును పొడగించాలని కోరుతూ హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం విచారించింది.
హిందూ తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఉంచి అత్యవసర విచారణను కోరారు. మే 17న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గడువు నవంబర్ 12తో ముగుస్తుందని తెలిపారు. దీంతో హిందూ పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మసీదులో ఉన్న శివలింగానికి రక్షణ, భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన తుది ఉత్తర్వును కొనసాగించాలని డిమాండ్ చేసింది. శివలింగానికి రక్షణ కోసం ఆదేశాన్ని కొనసాగించాలన్న డిమాండ్ పై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. హిందూ తరపు పిటిషన్ విచారణను సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్పై ధర్మాసనం ప్రశ్నించింది. దీనిని ట్రయల్ కోర్టు కొట్టివేసిందని, అలహాబాద్ హైకోర్టులో అప్పీలు పెండింగ్లో ఉందని జైన్ సమాధానమిచ్చారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
నవంబర్ 8న, వారణాసి కోర్టు ‘శివలింగాన్ని’ పూజించేందుకు అనుమతి కోరుతూ వేసిన ప్రత్యేక పిటిషన్పై తన నిర్ణయాన్ని నవంబర్ 14కి వాయిదా వేసింది కోర్టు. మే 17న, జ్ఞాన్వాపి మసీదు లోపల శివలింగాన్ని భద్రపరచాల్సిన అవసరం ఉందని, అయితే ప్రార్థనలు చేయడానికి ముస్లింలు ప్రాంగణంలోకి ప్రవేశించడంపై ఎటువంటి ఆంక్షలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. మే 20న, మసీదులో పూజలు చేసే హక్కును కోరుతూ హిందూ పక్షాల విచారణను సుప్రీంకోర్టు వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేసింది.
Related News
Liquor Policy Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిగ్ ట్విస్ట్, కేజ్రీవాల్ నిందితుడిగా చార్జిషీట్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసు ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను నిందితుడిగా చేర్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అంతేకాదు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం చార్జ్ షీట్ దాఖలు చేసింది.