Kidney Donation : లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ దానం చేయనున్న కూతురు రోహిణి..!!
- By hashtagu Published Date - 05:12 PM, Fri - 11 November 22
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమార్తె రోహిణి ఆచార్య నుంచి కిడ్నీ పొందనున్నారు. ఈ నెలాఖరులోనే లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడి చేయించుకోనున్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. దీంతో సింగపూర్ లో ఉన్న లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తన తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చారు.
ప్రస్తుతం బెయిల్ పై ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలో ఉన్నారు. పశుగ్రాసం కేసులో జైలుకెళ్లిన ఆయన చికిత్స కోసం ఢిల్లీ, రాంచీ ఆసుపత్రుల్లో చేరారు. అయితే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇంతకుముందు లాలూకు చికిత్స అందించిన ఎయిమ్స్ వైద్యులు కిడ్నీ మార్పిడి గురించి తమకు సమాచారం లేదని తెలిపారు. అయితే లాలూ ఎక్కడ చికిత్స తీసుకోబోతున్నారనేది ఇంకా సస్పెన్స్ గా ఉంది.
Related News
Gopalganj Accident: బీహార్లో ఆర్మీ వెహికిల్ ప్రమాదం: ఇద్దరు జవాన్లు మృతి
బీహార్లోని గోపాల్గంజ్లో సైనికులు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా డజనుకు పైగా సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన సిధ్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్హిమా మలుపు దగ్గర జరిగింది