RGV: పవర్ స్టార్’ స్పీచ్ పై ‘వర్మ’ షాకింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించిన
- By hashtagu Published Date - 02:54 PM, Thu - 24 February 22
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీకి… థమన్ సంగీతం అందించారు. 25న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం సాయంత్రం యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘భీమ్లా నాయక్’ మూవీ కోసం పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలానే వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కేటీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. “అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య మడప తిప్పని ఒక యుద్ధం” ఈ సినిమా అని చాలా సింపుల్ గా తేల్చి చేప్పేశారు పవన్ కళ్యాణ్. ఇది ఎవరిని ఉద్దేశించి పవన్ అన్నారో… మనం అర్దం చేసుకోవచ్చు.
కాగా, పవన్ ఇచ్చిన పవర్ ఫుల్ స్పీచ్ పై తనదైన శైలిలో స్పందించారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ లో పవర్ స్టార్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుకలో “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎంతో హుందాగా, అద్భుతంగా ఉందని.. ఆయన ప్రవర్తన, ప్రాతినిధ్యం వహించిన తీరు మర్యాదపూర్వకంగా ఉందని అన్నారు. అందుకే పవన్ ని స్టార్స్ అందరిలోకెల్లా పవర్ ఫుల్ అనేది” అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అనంతరం పవర్ స్టార్ స్పీచ్ వీడియోని షేర్ చేస్తూ… “ఇప్పటి వరకు పవన్ ఇచ్చిన స్పీచ్ లలో ఇదే ది బెస్ట్. ఎంతో భావోద్వేగంగా, హృదయపూర్వకంగా, వినయంగా ఉంది అని” తనదైన శైలిలో సద్విమర్శగా రాసుకొచ్చారు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా… అదే మరి మా పవర్ స్టార్ అంటే అంటూ… ఆర్జీవీ కి రిప్లై ఇస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
This is one of the best speeches of @PawanKalyan ever ..So heart felt , emotional and humble https://t.co/x5iGiSnowC via @YouTube
— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2022
Related News
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ భేరి’
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. చంద్రబాబు ప్రజాగళంతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుండగా, వైఎస్ జగన్ బస్సుయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.