సింహంతో ఎవరైనా గేమ్స్ ఆడతారా? లేదు కదా..అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా అడుగుదూరంలో సింహాన్ని పెట్టుకుని దాన్ని ఫోటో తీయడానికి ట్రైచేశాడు. ఇంతలో మీదకు దూకిన సింహం అతనిపై ఎటాక్ చేయబోయింది. ఇంటర్నెట్లో ఈ వీడియో వైరల్గా మారింది. ఆఫ్రికాలోని సెరింగెటీ నేషనల్ పార్క్లో పులులు, సింహాలు చాలా ఫ్రీగా తిరుగుతుంటాయి. అక్కడ ఉన్నట్టు మరెక్కడా సఫారీ ఉండదని కూడా అంటారు. అక్కడకు సఫారీకి వెళ్లిన ఓ టూరిస్ట్ బస్ డోర్ ఓపెన్ చేసి ఓ సింహాన్ని ఫోటో తీయబోయాడు. దీంతో భయపడిపోయిన సింహం అతనిమీదకు దూకబోయింది
యూట్యూబ్లో పోస్ట్ చేయగానే వీడియోకు వందలమంది కామెంట్స్ పెట్టారు. చాలామంది ఆ టూరిస్టును తిడుతూనే .. సఫారీ చేసేచోట కేర్టేకర్స్ జాగ్రత్తగా ఉండాలి కదా అని హెచ్చరించారు.
Also Read : నోట్లో నుంచి బయటికొచ్చిన సాలీడు.. వైరల్ అవుతున్న వీడియో
Also Read : అక్కడ పడుకోవడంతో ట్రోల్ అవుతున్న అమెరికా అధ్యక్షుడు