Indiramma House : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లోని అతి ముఖ్యమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి కీలక అప్డేట్ వెలువరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలు రానున్న శ్రీరామనవమి తర్వాత మరో శుభవార్త వింటారని అన్నారు. శ్రీరామనవమి తరువాత నుంచి లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు.
Read Also: Nagababu : పిఠాపురంలో నాగబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ శ్రేణులు
రైతులకు అన్ని విధాలా అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని, ఇందిరమ్మ పాలనలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనివ్వమని పేర్కొన్నారు. రైతుల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని ఆయన హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో తరుగు పెడితే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చారు. రైతులకు ఇప్పటివరకు రూ.20,609 కోట్లు రుణమాఫీ చేశామని, రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.
Read Also: Budget session : లోక్సభ నిరవధిక వాయిదా.. ముగిసిన బడ్జెట్ సమావేశాలు..