ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో బరిలో నిల్చున్న అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారం (Election Campaign) లో మునిగితేలుతున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు అన్ని గ్రామాలను చుట్టేస్తూ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇక అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) నేతలైతే వరుస పర్యటనలతో ఫుల్ బిజీ గా ఉన్నారు. ఓ పక్క గులాబీ బాస్ కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో జిల్లాల పర్యటన చేస్తుంటే..ఇక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు గ్రామాల బాట పట్టారు.
హుజురాబాద్ (Huzurabad) లో పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ప్రచారం జోరు జోరుగా నడుస్తుంది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి, కనగర్తి, మల్యాల, లక్ష్మాజిపల్లి గ్రామాల్లో ప్రచారంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..ఒక్క ఛాన్స్ ఇవ్వండి గ్రామాల రూపు రేఖలు మారుస్తా అంటూ ఓటర్లను కోరుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇల్లందకుంట మండలం అవుతుందని ఇక్కడి ప్రజలు అనుకున్నారా? అని ప్రజలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లందకుంటను మండలం చేశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇల్లందుకుంట ప్రజలకు 5 హామీలు ఇచ్చారు. 1. తాను గెలిచిన తర్వాత ఇల్లందకుంటను టెంపుల్ సిటీ చేస్తా అన్నారు. 2. తాళ్ళల్లో మంచి రిసార్ట్ ఏర్పాటు చేపిస్తా అని తెలిపారు. 3. రిజర్వాయర్ ను మంచి టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేస్తా అన్నారు. 4. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. 5. కరీంనగర్ లో లాగ ఇక్కడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కట్టిస్తామని తెలిపారు. దయచేసి ఎమ్మెల్యేగా ఒక్క సారి అవకాశం ఇవ్వాలని పాడి కౌశిక్ రెడ్డి కోరారు. అసెంబ్లీ ఎన్నిక ఇంకా 28 రోజులు మాత్రమే మిగిలి ఉందని, 28 రోజులు కాలికి బట్ట కట్టకుండా తిరిగి భారీ మెజారిటీతో బిఆర్ఎస్ పార్టీ గెలిపించాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గం లో లక్ష మెజారిటీకి తగ్గకుండా చూసుకోవాలన్నారు. 28 రోజులు నాకోసం కష్టపడితే ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడతానని ఆయన అన్నారు.
Read Also : NCB Raids : హైదరాబాద్లో కల్లు కాంపౌండ్లపై నార్కోటిక్స్ బ్యూరో దాడులు