Hyderabad : మోడీ, అమిత్‌షాల‌కు పాత‌బ‌స్తీ యువ‌కుడు బెదిరింపులు.. అరెస్ట్ చేసిన పోలీసులు

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను నరికి చంపిన సంఘటనతో దేశ వ్యాప్తంగా పోలీసులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు

  • Written By:
  • Updated On - June 30, 2022 / 09:07 AM IST

హైదరాబాద్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను నరికి చంపిన సంఘటనతో దేశ వ్యాప్తంగా పోలీసులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు. ముఖ్యంగా హైద‌రాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ,అమిత్ షాల‌ రెండు రోజుల పర్యటన ఉన్న నేప‌థ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమైయ్యారు. సోషల్ మీడియాను నిఘా వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. పాతబ‌స్తీకి చెందిన అబ్దుల్ మజీద్ అత్తార్ సోషల్ మీడియాలో వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. ప్రధాని, కేంద్ర హోం మంత్రిని తల నరికి చంపేస్తానని బెదిరింపు సందేశాన్ని పోస్ట్ చేయ‌డంతో మోఘల్‌పురా పోలీసులు అత‌డిని అరెస్టు చేశారు.

అత్తార్ ఫేస్‌బుక్‌లో “తోహినే రిసాలత్ పార్ ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి మోడీ యోగి అమిత్ షా ఇన్ కే బాప్ కో భీ మాఫీ మంగ్నా హోగా నాక్ రగద్ కే అంటూ మెసేజ్ పెట్టారని ఆరోపిస్తూ పోలీసులకు ఓ వ్య‌క్తి ఫిర్యాదు చేశారు. . నమంగే గే తో సార్ తాన్ సే జుడా”. అతని పోస్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోలు కూడా ఉన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు, మతపరమైన కారణాలతో రెండు వర్గాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే అత్తార్ సందేశాన్ని పోస్ట్ చేశారని పోలీసులు ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు IPC సెక్షన్లు 153A,295-A,504,505(2),506-II సెక్షన్ల కింద నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కొద్ది గంటల్లోనే అత‌డిని అరెస్టు చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు.