Nokia: నోకియా నుంచి లెటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్…ధర, ఫీచర్స్ ఇవే..!!

నోకియా...ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. మొబైల్ ఫోన్ల రంగంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. కాలక్రమంలో వెనకబడిపోయింది.

  • Written By:
  • Publish Date - July 12, 2022 / 10:00 AM IST

నోకియా…ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. మొబైల్ ఫోన్ల రంగంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. కాలక్రమంలో వెనకబడిపోయింది. ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చాక శాంసంగ్ వంటి కంపెనీల నుంచి ఎదురైన పోటీని తట్టుకోలేక మార్కెట్ పరంగా పతనాన్ని చూసింది. నిదానంగా మళ్లీ పుంజుకుంటోంది. ఇప్పుడు రేసులోకి వచ్చిన నోకియా…HMD గ్లోబల్ ద్వారా తన ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది.

తాజాగా నోకియా నుంచి జీ 21 ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ రూ. 15వేల లోపే వినియోగదారులకు అందించనుంది కంపెనీ. భారత్ లో దీని ధర రూ. 12,999గా ఉండనుంది. ఇందులో ప్రారంభ వెర్షన్ ఫోన్లో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ సదుపాయం ఉంది. మరో వెర్షన్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ కలిగి ఉంది. దీని ధర రూ. 14,999.

ఇది నార్డిక్ బ్లూ, డస్క్ కలర్లో లభ్యం కానుంది. ఇందులో 50 ఎంపీ సామర్థ్యంతో ఏఐ ఇమేజింగ్ తో కూడిన ట్రిపుల్ కెమెరాను పొందుపరిచారు. నోకియా జీ21లో లాంగ్ లైఫ్ బ్యాటరీ పొందుపరిచారు. సింగిల్ ఛార్జింగ్ తో మూడు రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఫీచర్స్ పరంగా చూస్తే 6.5 అంగుళాల డిస్ ప్లే, హెచ్డి రిజల్యూషన్, గూగుల్ అసిస్టెంట్ బటన్, ఆక్టాకోర్ ప్రాసెసర్ దీని ప్రత్యేకతలు. ఇతర కంపెనీలకు దీటుగా అత్యధిక రిఫ్రెష్ రేటు కలిగిఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ తన సెగ్మెంట్లో రెడ్ మీ, రియల్ మీ, శాంసంగ్ ఫోన్లకు పోటీ ఇస్తుందని అంతా భావిస్తున్నారు.