Suryapet Accident : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్టిన లారీ

సూర్యాపేట జిల్లా మునగాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ..

  • Written By:
  • Updated On - November 13, 2022 / 11:11 AM IST

సూర్యాపేట జిల్లా మునగాలలో ఘోర ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 10 మంది గాయపడ్డారు. మునగాల 65 నెంబర్ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు మృతి చెందగా మ.. రో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. మునగాలలోని సాగర్ కాలువ సాగర్ రెడ్డి రెగ్యులేటర్ వద్ద ఉన్న హరిహర సుత అయ్యప్ప దేవాలయంలో శనివారం అయ్యప్ప భక్తులు పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పడిపూజకి హాజరై తిరిగి వస్తుండగా పెట్రోల్ బంకు సమీపంలోకి రాగానే స్వాములు వారి బంధువులు ఉన్న ట్రాక్టర్ ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ లో ఉన్న మునగాలకు చెందిన తన్నీరు ప్రమీల, గుండు జ్యోతి, చింతకాయల ప్రమీల, నారగాని కోటయ్య, ఉదయ్ లోకేష్ లు మృతి చెందగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం 108 వాహనాల ద్వారా పోలీసులు కోదాడ, సూర్యాపేట ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది ఉన్నారు. యాక్సిడెంట్ తర్వాత ట్రాక్టర్‌ను దాదాపు 50 మీటర్ల వరకు లారీ లాక్కెళ్లింది.