Site icon HashtagU Telugu

Gold Rates: మరోసారి పెరిగిన గోల్డ్ రేట్స్.. తులం ధర ఎంత పెరిగిందంటే..?

Gold Price

Gold Price

Gold Rates: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,160గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.80,700కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 01, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: YS Sharmila: నాకైతే 15 సీట్లు కావాలి: సోనియా ముందు షర్మిల డిమాండ్

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,310గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,490గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,1500 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,160 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,160గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,160గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,600 ఉండగా, ముంబైలో రూ.77,600గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.80,700 ఉండగా, కోల్‌కతాలో రూ.77,600గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,500 ఉండగా, కేరళలో రూ.80,700గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,700 ఉండగా, విజయవాడలో రూ.80,700 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

Exit mobile version