Jagan Delhi Deals : వైసీపీ, టీడీపీ మ‌ధ్య `I.N.D.I.A` గేట్

Jagan Delhi Deals : ఎన్నిక‌ల వేళ తెర వెనుక రాజ‌కీయాల‌కు ప‌దునెక్కుతోంది. ఎన్డీయే కూట‌మితో ప‌రోక్షంగా వైసీపీ జ‌ర్నీ చేస్తోంది.

  • Written By:
  • Updated On - October 5, 2023 / 12:26 PM IST

Jagan Delhi Deals : ఎన్నిక‌ల వేళ తెర వెనుక రాజ‌కీయాల‌కు ప‌దునెక్కుతోంది. ఎన్డీయే కూట‌మితో ప‌రోక్షంగా వైసీపీ జ‌ర్నీ చేస్తోంది. గ‌త నాలుగురేళ్లుగా మోడీ, షా ద్వ‌యం చెప్పిందే ఏపీ సీఎం చేస్తున్నారు. సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన తొలి రోజుల్లోనే బీజేపీ ఢిల్లీ పెద్ద‌ల‌కు తెలియ‌కుండా ఏమీ చేయ‌బోమ‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇద్ద‌రూ చెప్పారు. ఆ మేర‌కు న‌డుచుకుంటూ బెయిల్ మీద ప‌రిపాల‌న సాగిస్తున్నారు. ఇటీవ‌ల ఇండియా కూట‌మికి ప‌రోక్షంగా టచ్ లోకి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెళ్లార‌ని ప్ర‌చారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ తో సంప్ర‌దింపులు జ‌రిపార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద వ‌చ్చిన టాక్.

ఇండియా కూట‌మితో చంద్ర‌బాబు టచ్ లోకి..(Jagan Delhi Deals)

జైలుకు చంద్ర‌బాబును పంపిన త‌రువాత ఏపీ రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయ‌ని వైసీపీ భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ మూడుముక్క‌లు అవుతుంద‌ని రెండు రోజుల క్రితం ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చేసిన ట్వీట్. దానికి పొడ‌గింపుగా ఇండియా కూట‌మితో చంద్ర‌బాబు టచ్ లోకి వెళ్లాల‌ని గురువారం మ‌రో ట్వీట్ చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో (Jagan Delhi Deals) చ‌ర్చ‌నీయాంశం అయింది. బ‌హుశా అందుకే, చంద్ర‌బాబును జైలుకు ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు పంపారా? అనే సందేహం క‌లుగుతోంది. గ‌త 27 రోజులుగా జైలు జీవితం గడుపుతోన్న చంద్ర‌బాబును బ‌య‌ట‌కు రాకుండా చేసేందుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ టూర్ పెట్టుకున్నారా? అనే ప్ర‌శ్న కూడా రాజ‌కీయవ‌ర్గాల్లో వినిపిస్తోంది.

బీజేపీకి బీ టీమ్ గా వైసీపీ

బీజేపీకి బీ టీమ్ గా వైసీపీ ఉంది. ఎన్డీయేలో భాగ‌స్వామి కావ‌డానికి కూడా ఒకానొక సంద‌ర్భంలో బీజేపీ, వైసీపీ మ‌ధ్య సంప్ర‌దింపులు జ‌రిగాయి. ఆ విష‌యాన్ని వైసీపీ లీడ‌ర్లే గ‌త ఏడాది బ‌య‌ట‌పెట్టారు. కేంద్ర ప్ర‌భుత్వంలో చేర‌మ‌ని బీజేపీ పెద్ద‌ల నుంచి ఒత్తిడి ఉంద‌ని గ‌త ఏడాది క్యాబినెట్ విస్త‌ర‌ణ సంద‌ర్భంగా వైసీపీ లీడ‌ర్ల నుంచి వ‌చ్చిన మాట‌లు. ఎన్డీయే కూట‌మిలో లేక‌పోయిన‌ప్ప‌టికీ బీజేపీకి అన్న ర‌కాలుగా స‌హ‌కారాన్ని వైసీపీ అందిస్తోంది. ప్ర‌తిఫ‌లంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏమి చెప్పినా, మోడీ స‌ర్కార్ అన్ని ర‌కాలుగా స‌హ‌కారం ఇస్తోంది. ఇప్పుడు చంద్ర‌బాబును జైలుకు పంపే విష‌యంలోనూ ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల ప్ర‌మేయం  (Jagan Delhi Deals) ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : CBN Arrest: చంద్రబాబు జాతీయ నాయకుడు.. గుర్తు పెట్టుకో కేటీఆర్

ఎన్డీయేలో భాగ‌స్వామిగా మారాల‌ని తెలుగుదేశం పార్టీ ఇటీవ‌ల ప్ర‌య‌త్నం చేసింది. అందుకు సంబంధించిన ప్ర‌య‌త్నాలు కూడా జ‌రిగాయి. కానీ, బీజేపీ నుంచి పాజిటివ్ సంకేతాలు రాలేద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని టాక్‌. జ‌న‌సేన‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని బీజేపీ భావించింది. కానీ, తెలుగుదేశం పార్టీతో పొత్తును ప‌వ‌న్ ఖ‌రారు చేయ‌డంతో బీజేపీ డైల‌మాలో ప‌డింది. ఇప్పుడు ఏమి చేయాలి? అనే అంశంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది. ఆ క్ర‌మంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న (Jagan Delhi Deals) ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

Also Read : Jagan Delhi Secret : జ‌గ‌న్ `ముందు`కు..! ఢిల్లీ అందుకే..!!

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్న స‌మ‌యంలోనే ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి హాట్ ట్వీట్ చేయ‌డం జ‌రిగింది. ఇండియా కూట‌మితో చంద్ర‌బాబు ట‌చ్ లో ఉన్నార‌ని ఆ ట్వీట్ సారాంశం. దానికి బ‌లం చేకూరేలా చంద్ర‌బాబు ప‌క్షాన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక న్యాయ‌వాది సుప్రీం కోర్టులో వాదిస్తున్నార‌ని ఆ ట్వీట్ లో గుర్తు చేశారు. ఇటీవ‌ల ఇండియా కూట‌మికి ట‌చ్ లోకి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెళ్లాడ‌ని కొన్ని ప‌త్రిక‌ల్లో న్యూస్ వ‌చ్చింది. ఎన్నిక‌ల త‌రువాత అవ‌స‌ర‌మైతే, ఇండియా కూట‌మికి మ‌ద్ధ‌తు ఇస్తాన‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. దానికి కౌంట‌ర్ గా ఇప్పుడు విజ‌య‌సాయిరెడ్డి టీడీపీ రాబోవు రోజుల్లో ఇండియా కూట‌మితో క‌ల‌వ‌నుంద‌ని ట్వీట్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.