AP : ఇంటర్‌ విద్యార్థిని అత్యాచారం చేసి..కళ్లు పీకేసి బావిలో పడేసారు

గోపాలపురం కు చెందిన భవ్యశ్రీ..ఇంటర్ చదువుతుంది. సెప్టెంబర్ 17న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన భవ్యశ్రీ తిరిగి రాలేదు.అప్పటి నుండి తల్లిదండ్రులు వెతుకుతూనే ఉన్నారు

  • Written By:
  • Publish Date - September 26, 2023 / 12:05 PM IST

ఏపీ (AP)లో ఆడవారికి రక్షణ లేదని..18 ఏళ్ల అమ్మాయిలు పెద్ద ఎత్తున మిస్ అవుతున్నారని ..అత్యాచారాలు ఎక్కువై పోతున్నాయని ఓ పక్క విమర్శలు వినిపిస్తున్న ప్రభుత్వం మాత్రం రక్షణ కల్పించడం లో విఫలం అవుతూనే ఉంది. ఎన్ని విమర్శలు వస్తున్న వాటిపై శ్రద్ద పెడదామని , విమర్శలకు చెక్ పెడదామని పోలీసులు అనుకోవడమే లేదు. అంత అయినా తర్వాత కేసు పెట్టడం..దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం..అంతే సంగతి. నిందితులను పట్టుకొని కఠిన శిక్షలు విధించడం లో ఫెయిల్ అవుతున్నారు. దీంతో కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు.

తాజాగా చిత్తూరు జిల్లా (Chittoor District) పెనుమూరు మండలంలో ఓ ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అత్యాచారం అనంతరం కళ్లు పీకి, జుట్టు కత్తిరించి..దారుణంగా హత్య చేసి బావిలో పడేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం.. గోపాలపురం కు చెందిన భవ్యశ్రీ (Bhavyasri)..ఇంటర్ చదువుతుంది. సెప్టెంబర్ 17న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన భవ్యశ్రీ తిరిగి రాలేదు.అప్పటి నుండి తల్లిదండ్రులు వెతుకుతూనే ఉన్నారు. వినాయక నిమజ్జనం కోసం సెప్టెంబర్ 20న వేణుగోపాలపురం గ్రామానికి చెందిన కొందరు బావి వద్దకు వెళ్లగా.. మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా.. ఆభరణాల ఆధారంగా మునికృష్ణ, పద్మావతి దంపతులు తమ కుమార్తె భవ్యశ్రీ గా గుర్తించారు. భవ్యశ్రీ కనిపించడం లేదని సెప్టెంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు వెంటనే స్పందించి ఉంటే తమ కూతురు బతికే ఉండేదని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. భవ్యశ్రీని నలుగురు యువకులు ప్రేమ పేరుతో వేధించే వారు. వారే మాయమాటలు చెప్పి భవ్యశ్రీని ఇంటి నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేసి.. కళ్లు పీకి, జుట్టు కత్తిరించి మృతదేహాన్ని బావిలో పడేశారని తల్లిదండ్రులు అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also : Pawan Kalyan : ఈ ఐదు రోజులు పవన్ అక్కడే బిజీ గా ఉండబోతున్నాడు..