ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణ(Andhra Pradesh Assembly Premises)లో అరకు కాఫీ స్టాల్(Araku Coffee Stall)ను ప్రారంభించారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ స్టాల్ను ప్రారంభించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరకు ప్రాంతంలో పండించిన కాఫీ విశ్వవ్యాప్తంగా పేరుగాంచిన విషయం తెలిసిందే. ఇకపై అసెంబ్లీ ప్రాంగణంలోనూ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి ఈ ప్రత్యేకమైన కాఫీ అందుబాటులో ఉండనుంది.
Supreme Court : ట్రయిల్ కోర్టుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం
కాఫీ ఉత్పత్తులను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కాఫీ అందించారు. ఈ ఘటన అక్కడున్న వారందరికీ హర్షదాయకంగా అనిపించింది. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య స్నేహపూర్వక సంభాషణ జరగడం, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రజలను ఆకర్షించడం ఆసక్తికరంగా మారింది. అరకు కాఫీ (Araku Coffee) స్వచ్ఛమైన రుచితో, విశిష్టమైన నాణ్యతతో ఉండటంతో, ఈ స్టాల్కు మంచి స్పందన వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
Tabebuia Rosea : హైదరాబాద్ వాసులను ఆకట్టుకుంటున్న ‘పింక్ ఫ్లవర్’ చెట్లు
అరకు కాఫీ (Araku Coffee) ప్రోత్సాహాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పార్లమెంట్ ప్రాంగణంలోనూ అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుకు ఆమోదం లభించడం గమనార్హం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన గుర్తింపు లభించడంతో పాటు, అరకు ప్రాంతంలోని గిరిజన రైతులకు అధిక ఆదాయం వస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. ఈ కాఫీ స్టాల్ ద్వారా రాష్ట్ర బ్రాండ్గా అరకు కాఫీ మరింత ప్రాచుర్యం పొందుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.