Tirumala : భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..తిరుమలలో భద్రత కట్టుదిట్టం

తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తిరుమల సీవీఎస్‌వో (చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ ఆఫీసర్) కార్యాలయంలో జరిగింది. భద్రతా ఏర్పాట్లు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రవేశాల వ్యవస్థ, నిఘా పటిష్టతపై అధికారులు చర్చించారు.

Published By: HashtagU Telugu Desk
Tensions on the India-Pakistan border.. Security tightened in Tirumala

Tensions on the India-Pakistan border.. Security tightened in Tirumala

Tirumala : భారత్-పాక్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా తిరుమలలో భద్రతను మరింత కఠినంగా చేశారు. యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ పుణ్యక్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తిరుమల సీవీఎస్‌వో (చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ ఆఫీసర్) కార్యాలయంలో జరిగింది. భద్రతా ఏర్పాట్లు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రవేశాల వ్యవస్థ, నిఘా పటిష్టతపై అధికారులు చర్చించారు.

Read Also: Nuclear Bomb: ఖరీదైన అణుబాంబు ఏ దేశం వద్ద ఉందో తెలుసా..?

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికల ప్రకారం అన్ని దేవాలయ ప్రాంతాల్లో జాగ్రత్తలు మరింతగా తీసుకోవాలని ఎస్పీ సూచించారు. మధ్యాహ్నం నుంచి భద్రతా బలగాలు తిరుమలలో తనిఖీలు ప్రారంభించనున్నాయి. ప్రతి ప్రధాన రహదారి, గాలిగోపురం, నందీ సర్కిల్, ఆలయం పరిసరాల్లో భద్రతా సిబ్బంది మోహరించనున్నారు. అదేవిధంగా, డోలోమెయిన్, టోల్‌గేట్‌, అలిపిరి మెట్ల మార్గం వంటి ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించేందుకు అదనపు సిబ్బందిని నియమించారు.

సీసీ టీవీల ద్వారా నిఘాను మరింత బలోపేతం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్‌లు సిద్ధంగా ఉంచారు. యాత్రికులు శాంతియుతంగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేలా పోలీసులు పూర్తి స్థాయిలో సమీకృత చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారుల సూచన. తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా విభాగం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భక్తుల భద్రతకే ప్రధాన ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుత పరిస్థితే ఎలా ఉన్నా భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం,’’ అని ఆయన వెల్లడించారు.

Read Also: CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు పర్యటన రద్దు

 

  Last Updated: 09 May 2025, 12:23 PM IST