విశాఖపట్నం వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్రూయిజ్ విహారయాత్ర అందుబాటులోకి రావడంతో విశాఖవాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చాలా కాలం పాటు అందుల్ప్ ప్రయాణించాలి అనుకున్న వారి కల నెరవేరినట్టయింది. అయితే విశాఖ వాసులే కాకుండా పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్గడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు విశాఖ నుంచి క్రూయిజ్ విహార యాత్రకు పోటీ పడ్డారు.ఈ క్రమంలోనే తొలి సర్వీసుకు పూర్తి స్థాయిలో టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ నెల 15వ తేదీన మరో సర్వీసుకు 90 శాతం టికెట్ల విక్రయాలు జరగగా.. 22వ తేదీకి పూర్తిస్థాయిలో ఫుల్ అయినట్లు తెలుస్తోంది. అలాగే జూలై, ఆగస్టు, సెపె్టంబర్ మాసాల్లో సర్వీసులకు అప్పుడే 60 శాతం టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.
కార్డీలియా క్రూయిజ్ ఒక మూవింగ్ స్టార్ హోటల్. మొట్టమొదటిసారిగా విలాసవంతమైన క్రూయిజ్లో విహారయాత్ర సరికొత్త అనుభూతిని ఇస్తుందట. అయితే ఇందులో ప్రయాణించినప్పుడు బయట ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ షిప్ లోపల సకల సదుపాయాలు, సౌకర్యాలను బాగా ఎంజాయ్ చేయవచ్చట. అంతేకాకుండా వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ సంతోషంగా, విలాసవంతంగా గడిపే మంచి యాత్ర అని చెప్పవచ్చు. ఇక ఈ షిప్ లో ప్రత్యేకతల విషయానికి వస్తే..మూడు రోజుల పాటు సముద్రంలో ప్రయాణం,సెవెన్ స్టార్ హోటల్కు మించి విలాసవంతమైన నౌకలో విహారం,బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 24 గంటలు వినోదం,విభిన్న వంటకాలతో రుచికరమైన ఆహారం,ఆరోగ్యానికి జిమ్, ఫిట్నెస్ సెంటర్ల సౌకర్యం,స్విమ్మింగ్ పూల్స్లో జలకాలాటలు,రాక్ క్లైంబింగ్ విన్యాసాలు ఇలా మంచిమంచి సదుపాయాలు ఉన్నాయట.