Bomb Blast-Toilet : టాయిలెట్‌ లో బాంబు పేలుడు.. బాలుడి మృతి

పబ్లిక్ టాయిలెట్ వద్ద బాంబు(Bomb Blast-Toilet) పేలింది. ఈ ఘటనలో 11 ఏళ్ల  బాలుడు దుర్మరణం పాలయ్యాడు.

  • Written By:
  • Updated On - June 5, 2023 / 02:02 PM IST

పబ్లిక్ టాయిలెట్ వద్ద బాంబు(Bomb Blast-Toilet) పేలింది. ఈ ఘటనలో 11 ఏళ్ల  బాలుడు దుర్మరణం పాలయ్యాడు. సోమవారం ఉదయం పశ్చిమ బెంగాల్ లోని  నార్త్ 24 పరగణాస్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుభాస్పల్లికి చెందిన ఈ బాలుడు.. బొంగావ్ ప్రాంతంలోని రైలు గేట్-1 సమీపంలోని ఒక పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్ళాడు. అయితే అప్పటికే గుర్తు తెలియని దుండగులు ఆ టాయిలెట్ లో(Bomb Blast-Toilet)  ఉంచిన బాంబులు పేలాయి.

Also read : Robber Emotional : హగ్ తో దొంగ ఎమోషనల్.. కట్ చేస్తే..

ఆ టైంలో పబ్లిక్ టాయిలెట్‌ లోనే ఉన్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడికి ఎక్కువగా రక్త స్రావం కూడా జరిగింది.  బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పబ్లిక్ టాయిలెట్‌లో బాంబులు దాచిన వాళ్ళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.