పబ్లిక్ టాయిలెట్ వద్ద బాంబు(Bomb Blast-Toilet) పేలింది. ఈ ఘటనలో 11 ఏళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. సోమవారం ఉదయం పశ్చిమ బెంగాల్ లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుభాస్పల్లికి చెందిన ఈ బాలుడు.. బొంగావ్ ప్రాంతంలోని రైలు గేట్-1 సమీపంలోని ఒక పబ్లిక్ టాయిలెట్కు వెళ్ళాడు. అయితే అప్పటికే గుర్తు తెలియని దుండగులు ఆ టాయిలెట్ లో(Bomb Blast-Toilet) ఉంచిన బాంబులు పేలాయి.
Also read : Robber Emotional : హగ్ తో దొంగ ఎమోషనల్.. కట్ చేస్తే..
ఆ టైంలో పబ్లిక్ టాయిలెట్ లోనే ఉన్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడికి ఎక్కువగా రక్త స్రావం కూడా జరిగింది. బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పబ్లిక్ టాయిలెట్లో బాంబులు దాచిన వాళ్ళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.