KTR: ప్రజా హామీలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కేటీఆర్

ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు అనేక కుట్రలు పన్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

  • Written By:
  • Publish Date - December 7, 2023 / 12:32 PM IST

KTR: ఇటీవల ముగిసిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి స్పీడ్ బ్రేకర్ మాత్రమే పడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. “మా పార్టీ అతి త్వరలో పుంజుకుంటుంది. నిరాశ చెందాల్సిన అవసరం లేదు” అని పార్టీ కార్యకర్తలతో కేటీఆర్ అన్నారు.  తెలంగాణ కోసం ఏకైక గొంతుక కే.చంద్రశేఖర్ రావు అని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైనందుకు ప్రజలు ఇంకా షాక్‌లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కోసారి ఫలితాలు ఊహించని విధంగా ఉంటాయని ఆయన అన్నారు. BRS అనేది అనేక ఉద్యమాల ఫలితం. ఇలాంటి పరిణామాలు పార్టీకి కొత్తేమీ కాదన్నారు.

ప్రతిపక్షాలు ఓటర్లను రకరకాలుగా ప్రలోభపెట్టాయని అన్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు అనేక కుట్రలు పన్నారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం కోసం ఓటేసిన ప్రజలు ఉన్నారని ఆయన నొక్కి చెప్పారు. ఎన్నికలకు ముందు, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నప్పుడు డబ్బు, మద్యం పంపిణీ చేయనని చెప్పాను.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాను.. ప్రజలు కూడా నన్ను వదులుకోలేదని.. వారిపై నా నమ్మకం చెక్కుచెదరలేదని నిరూపించారని మాజీ మంత్రి అన్నారు.

ప్రజలు ఇప్పటికీ బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారని, పార్టీపై నమ్మకం కోల్పోలేదని ఆయన అన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను బీఆర్‌ఎస్ అద్భుతంగా పోషిస్తుందని అన్నారు. ప్రజల గొంతుకగా పార్టీ మారుతుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ ఉద్ఘాటించారు.

Also Read: Cyberabad: ఇయర్ ఎండ్ పార్టీలు చేసుకుంటున్నారా.. పోలీస్ పర్మిషన్ మస్ట్!

Follow us