Mega Job Mela: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో హుజూర్నగర్లో ఈ నెల అక్టోబర్ 25న రాష్ట్రంలోనే అతిపెద్ద మెగా జాబ్ మేళా (Mega Job Mela)ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మెగా జాబ్ మేళాను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల- పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగత పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జాబ్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హుజూర్నగర్ వేదిక వద్ద ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, పరిశ్రమల కమిషనర్ కూడా పాల్గొననున్నారు.
భారీగా కంపెనీలు
రానున్న జాబ్ మేళాలో సుమారు 200 కంపెనీలు పాల్గొంటాయాని, దాదాపు 12,000- 13,000 మందికి పైగా నిరుద్యోగ యువత హాజరవుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంచనా వేస్తున్నారు. ఇటీవల మంత్రి మాట్లాడుతూ.. యువతకు వారి సొంత ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Also Read: Chiranjeevi Diwali Celebrations : మెగా సంబరాలకు బాలయ్యకు ఆహ్వానం అందలేదా..?
ఏర్పాట్లపై సమీక్ష
సమీక్షా సమావేశంలో ప్రధానంగా టెంట్ హౌస్ల ఏర్పాటు, నిరుద్యోగుల కోసం అల్పాహారం, భోజన సదుపాయాలు, వేదిక వద్ద ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఈ కార్యక్రమం గురించి మరింత మందికి తెలిసేలా హోర్డింగ్ల ఏర్పాటు, వార్తాపత్రికలలో కరపత్రాల ముద్రణ, విస్తృత ప్రచారం వంటి విషయాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు.
ఈ కీలకమైన ఏర్పాట్ల సమీక్షలో పాల్గొనేందుకు తమ వైపు నుండి ఒక సీనియర్ అధికారిని పంపాల్సిందిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్ని కోరారు. ఈ మెగా జాబ్ మేళా సూర్యాపేట జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఒక గొప్ప అవకాశమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ జాబ్ మేళా విజయవంతం అయ్యేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నాయి.