తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రాఖీ పండగ సందర్భంగా ప్రత్యేకమైన ఫొటోలను షేర్ చేశారు. కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి అని క్యాప్షన్ ఇచ్చారు. చిన్నప్పుడు తన సోదరి కవితతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు కేటీఆర్. ఆ ఫోటోతోపాటుగా ఆయన కుమారుడు, కుమార్తే హిమాన్షు, అలేఖ్య కలిసి రాఖీ పండగా సందర్భంగా దిగిన ఒక ఫొటోను కూడా ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే కేటీఆర్…సందర్భానుసారంగా ట్వీట్లు, ఫొటోలు షేర్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Some bonds are so special 😊#HappyRakhi #HappyRakshabandan pic.twitter.com/9WPibLeQMi
— KTR (@KTRTRS) August 12, 2022