CM Revanth Reddy Black Mail : ఫండ్స్‌ కోసం వ్యాపారులను సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ – ఈటెల

రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి ఫండ్స్‌ పంపటానికి రాష్ట్రంలోని వ్యాపారులను సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ (CM Revanth Reddy Black Mail ) చేస్తున్నారని ఈటెల ఆరోపించారు

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 10:26 AM IST

మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ (Etela Rajender)..సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఫై సంచలన ఆరోపణలు చేసారు. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి ఫండ్స్‌ పంపటానికి రాష్ట్రంలోని వ్యాపారులను సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ (CM Revanth Reddy Black Mail) చేస్తున్నారని ఈటెల ఆరోపించారు. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్టు రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని.. ఆయన బ్లాక్ మెయిల్ చిట్టా అంత రికార్డు అవుతున్నదని అన్నారు. రాష్ట్రంలో అన్నీ తానేనని రేవంత్‌ విర్రవీగుతున్నారని, దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈటెల హెచ్చరించారు. నడమంత్రపు సిరిలా ముఖ్యమంత్రి పదవి వచ్చిన రేవంత్‌.. రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని విమర్శించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించటానికి సిద్ధంగా లేరని ఈటెల పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్​‌ మాదిరిగానే.. నేటి కాంగ్రెస్​ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నేతల ఫోన్​లు ట్యాపింగ్ చేస్తుందని ఈటల అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మెప్పు పొందడానికి బిల్డర్లను, వ్యాపారవేత్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఖబర్ధార్ అంటూ హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, దేశ ప్రజలకు ధైర్యాన్ని అందించిన నాయకుడు మోడీ అని వ్యాఖ్యానించారు. తనకు మద్దతు ప్రకటించిన పలు కాలనీ సంఘాలకు ఈటల రాజేందర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Read Also : Building Collapse : కోల్‌కతాలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఇద్దరు మృతి