కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువు సమీపంలో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. పార్కింగ్లో ఉంచిన బస్సుల్లో అర్ధరాత్రి మంటలు (Fire) చెలరేగాయి. ఈ ఘటనలో భారతి ట్రావెల్స్కు చెందిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకొని రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Also Read: Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో విచారణ!