MS Dhoni: ఆర్మీలోకి మళ్ళీ ధోనీ .. ఎప్ప్పుడంటే?

ధోనికిదే చివరి ఐపీఎల్ అని కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనికి ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి మిస్టర్ కూల్ ఇంట్రెస్టింగ్​ రిప్లై ఇచ్చాడు.

MS Dhoni: ధోనికి ప్రస్తుతం 42 ఏళ్ళు. అతనిప్పుడు ఐపీఎల్ లో మాత్రమే రాణిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ ఐపీఎల్ లోను ధోనీ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనిపించుకున్నాడు. చెన్నైకి ఐదు ట్రోఫీలు అందించిపెట్టాడు. కాగా ధోనికిదే చివరి ఐపీఎల్ అని కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనికి ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి మిస్టర్ కూల్ ఇంట్రెస్టింగ్​ రిప్లై ఇచ్చాడు.

చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యాతగా, క్రికెట్ అకాడమీ నిర్వహించడం, కోచ్​గా, లేదా వ్యాపారం వైపు అడుగులు వేస్తారు. కానీ ఎంఎస్​ ధోనీ ఆట నుంచి వీడ్కోలు పలికిన తర్వాత ఎం చేస్తారు అన్న ప్రశ్నకు ధోనీ ఇచ్చిన సమాధానం ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. క్రికెట్ కు పూర్తిస్థాయిలో రిటైర్మెంట్ ప్రకటించాక ఎక్కువ సమయాన్ని ఆర్మీలో గడపాలనుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్మీకి తగిన టైమ్ కేటాయించలేకపోయాను. ఆ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఆర్మీకి ఎక్కువ టైమ్ కేటాయిస్తానని చెప్పాడు. ధోని చెప్పిన ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

2011లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ధోనికి ఇండియన్ ఆర్మీ అరుదైన ఘనతనిచ్చి సత్కరించింది. భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకులో ధోనీని నియమించింది. దీంతో ధోని 2015లో ట్రైనింగ్ క్యాంపులో, 2019లో జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వర్తించాడు. చిన్నప్పటినుంచి ఆర్మీని ఇష్టపడే ధోనీ రిటైర్మెంట్ తర్వాత తనకు ఇష్టమైన ఆర్మీలో గడపడం అభినందనీయం.

Also Read: Nava Kerala Sadas: కేరళ ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిపై కేసు