Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవడంతో కృనాల్ తన కెరీర్ లో ఐదో ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. త‌ద్వారా ఐపీఎల్ లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్ల ఎలైట్ క్లబ్ లో చేరాడు. దిగ్గజాల సరసన కృనాల్ ఐపీఎల్ లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ఆటగాళ్లుగా రోహిత్ […]

Published By: HashtagU Telugu Desk
Krunal Pandya wins the IPL title for the fifth time.

Krunal Pandya wins the IPL title for the fifth time.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవడంతో కృనాల్ తన కెరీర్ లో ఐదో ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. త‌ద్వారా ఐపీఎల్ లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్ల ఎలైట్ క్లబ్ లో చేరాడు.

దిగ్గజాల సరసన కృనాల్
ఐపీఎల్ లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ఆటగాళ్లుగా రోహిత్ శర్మ, అంబటి రాయుడు (చెరో 6 టైటిళ్లు) అగ్రస్థానంలో ఉన్నారు. వీరి తర్వాత ఐదు టైటిళ్లతో ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. ఇప్పుడు కృనాల్ పాండ్యా కూడా ఈ జాబితాలో చేరి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ 2017, 2019, 2020లో మూడు టైటిళ్లు గెలిచిన కృనాల్, 2025లో ఆర్సీబీ జట్టులోకి వచ్చాక ఆ జట్టుకు వరుసగా రెండు టైటిళ్లు (2025, 2026) అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఆర్సీబీకి కీలక ఆటగాడిగా..
ఒకప్పుడు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన కృనాల్, 2025లో ఆర్సీబీకి మారడం అతని కెరీర్ కు, జట్టుకు కూడా కలిసొచ్చింది. 2025 ఫైనల్ లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచిన అతను, 2026 సీజన్ లోనూ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ లో 226 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లు పడగొట్టి జట్టు టైటిల్ నిలబెట్టుకోవడంలో సహాయపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ లో కూడా పొదుపుగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత వరుసగా రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది.

మ్యాచ్ అనంతరం కృనాల్ పాండ్యా తన ఆనందాన్ని పంచుకున్నాడు. “ప్రతి ఐపీఎల్ ట్రోఫీ ప్రత్యేకమైనదే. ఇది పిల్లలకు జన్మనిచ్చినట్టుగా ఉంటుంది, ఎవరినీ ఎంచుకోలేం… దేనికదే ప్రత్యేకం. 11 ఏళ్ల కెరీర్ లో ఐదు టైటిళ్లు గెలవడం నాకు చాలా స్పెషల్” అని అన్నాడు. కష్టకాలంలోనూ జట్టుకు అండగా నిలిచిన ఆర్సీబీ అభిమానులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపాడు.

  Last Updated: 02 Jun 2026, 02:06 PM IST