Rohit Sharma: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు కష్టాల్లో పడినట్లు కనిపిస్తోంది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మొదటి మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత, MI వరుసగా మూడు ఓటములను చవిచూసింది. ఇప్పుడు వారి తర్వాతి పోరు పంజాబ్ కింగ్స్తో జరగనుంది. పంజాబ్ కింగ్స్ ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దూసుకుపోతోంది. ఇలాంటి స్థితిలో పంజాబ్ను ఓడించడం ముంబైకి అంత సులభం కాదు. దీనికి తోడు రోహిత్ శర్మ గాయం ముంబై ఇండియన్స్ కష్టాలను మరింత పెంచింది. పంజాబ్ కింగ్స్తో జరిగే తర్వాతి మ్యాచ్కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చు.
రోహిత్ శర్మ గాయంపై అప్డేట్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. దీనివల్ల రోహిత్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు చేరుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ తిరిగి బ్యాటింగ్ చేయడానికి రాలేదు. ముంబై జట్టులో రోహిత్ అత్యంత కీలక ఆటగాడు కావడంతో ఆయన గాయం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఓ నివేదిక ప్రకారం.. రోహిత్ హ్యామ్స్ట్రింగ్ గాయానికి సంబంధించి స్కాన్ చేయించుకోనున్నాడు. ఆ నివేదిక వచ్చిన తర్వాతే గాయం తీవ్రత ఎంత ఉందనేది స్పష్టమవుతుంది.
Also Read: ఏప్రిల్ 15న బ్యాంకులకు ఎందుకు సెలవు?
ఏప్రిల్ 16న పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో రోహిత్ ఆడటంపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. మెడికల్ రిపోర్ట్ పాజిటివ్గా వస్తేనే ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే టోర్నమెంట్ ఇప్పుడే ప్రారంభమైనందున తమ స్టార్ ప్లేయర్ విషయంలో ముంబై ఇండియన్స్ ఎలాంటి రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. అందుకే ఈ మ్యాచ్లో రోహిత్కు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. పంజాబ్తో రోహిత్ ఆడటం దాదాపు కష్టంగానే కనిపిస్తోంది.
రోహిత్ శర్మ లేకపోతే అవకాశం ఎవరికి?
రోహిత్ శర్మ పంజాబ్ కింగ్స్తో మ్యాచ్కు దూరమైతే క్వింటన్ డి కాక్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆయన కోసం ట్రెంట్ బౌల్ట్ లేదా మిచెల్ శాంట్నర్లలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్ మార్చకూడదు అనుకుంటే ముంబై ఇండియన్స్ యువ ఓపెనర్ డానిష్ మలేవార్ను బరిలోకి దించవచ్చు. ఇది కాకుండా గతంలో ముంబై కోసం ఓపెనింగ్ చేసిన అనుభవం ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక ఆప్షన్గా ఉన్నాడు.
