మీడియా నివేదికల ప్రకారం.. భారతదేశపు అత్యంత ధనిక ఫిల్మ్ మేకర్ల జాబితాలో ఒక పేరు వినిపిస్తోంది. ఆయన బాలీవుడ్ వ్యక్తి కాకపోయినప్పటికీ రూ. 26,000 కోట్ల భారీ ఆస్తితో దేశంలోనే అత్యంత ధనిక సినీ నిర్మాతగా నిలిచారు. ఈయన సంపద షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ల ఉమ్మడి ఆస్తి కంటే చాలా ఎక్కువ.
భారతదేశపు అత్యంత ధనిక ఫిల్మ్ మేకర్ ఎవరు?
ఫోర్బ్స్ 2026 సంవత్సరానికి గాను ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఇందులో కళ, వినోద రంగాల నుండి పలువురు ప్రముఖులు చోటు సంపాదించుకున్నారు. అయితే వరుసగా నాలుగో ఏడాది కూడా ‘సన్ గ్రూప్’ అధినేత కళానిధి మారన్ అత్యంత ధనిక భారతీయ చిత్ర నిర్మాతగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఆయన మొత్తం ఆస్తి $2.8 బిలియన్లు (సుమారు రూ. 26,000 కోట్లు). ఈ సంపదలో ఎక్కువ భాగం ఆయన ప్రొడక్షన్ హౌస్ అయిన ‘సన్ పిక్చర్స్’ నుండి వస్తోంది.
Also Read: బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్మన్ గిల్, స్మృతి మంధాన!
షారుఖ్ మరియు ఆదిత్య చోప్రాల కంటే ఎంతో ముందు..
కళానిధి మారన్ సంపద ఎంతటిదంటే బాలీవుడ్ అగ్రశ్రేణి దిగ్గజాలైన షారుఖ్ ఖాన్ (రూ. 12,480 కోట్లు), ఆదిత్య చోప్రా (రూ. 7,700 కోట్లు), కరణ్ జోహార్ (రూ. 1,880 కోట్లు)ల మొత్తం ఆస్తులను కలిపినా మారన్ ఆస్తికి సరిపోవు. ఈ రేసులో ఆయన రాణీ స్క్రూవాలా ($1.6 బిలియన్లు)ను కూడా వెనక్కి నెట్టారు.
మారన్ సామ్రాజ్యం – వ్యాపార విస్తరణ
సన్ పిక్చర్స్: ఈ బ్యానర్పై రోబో, పెట్టా, బీస్ట్, జైలర్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన రజనీకాంత్, అల్లు అర్జున్, అట్లీ వంటి వారితో భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు.
సన్ టీవీ నెట్వర్క్: 1993లో ప్రారంభమైన ఈ నెట్వర్క్ ప్రస్తుతం 37 ఛానళ్లతో దేశంలోని 14 కోట్ల ఇళ్లకు చేరుకుంది. టీవీతో పాటు రేడియో, వార్తాపత్రికలు, DTH సేవల్లో కూడా ఆయన అగ్రగామిగా ఉన్నారు.
క్రికెట్ ప్రపంచంలో కూడా రారాజు
వినోద రంగమే కాకుండా క్రీడారంగంలో కూడా కళానిధి మారన్ ఒక పెద్ద పేరు. ఆయనకు మూడు ప్రధాన క్రికెట్ జట్లు ఉన్నాయి.
- సన్ రైజర్స్ హైదరాబాద్ (IPL)
- సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ (SAT20)
- సన్ రైజర్స్ లీడ్స్ (The Hundred)
ఈ వ్యాపారంలో ఆయన కుటుంబం మొత్తం చురుగ్గా పాల్గొంటోంది. భార్య కావేరీ మారన్ సన్ టీవీ కంటెంట్ బాధ్యతలు చూస్తుండగా, కుమార్తె కావ్య మారన్ మూడు క్రికెట్ ఫ్రాంచైజీలకు సీఈఓగా (CEO) వ్యవహరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
