హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాచారం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్కు చెందిన కె సుబుధి జాన్సన్ (30), బోరబండకు చెందిన మహ్మద్ సోహైబ్ (21)లు వైజాగ్కు చెందిన సుధీర్ సాహూ వద్ద గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయించేందుకు సిద్ధమైయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి వీరిని పోలీసులు పట్టుకున్నారు. వీరు గంజాయిని కిలో రూ.2,000కి కొనుగోలు చేసి, దానిని రూ.15,000కి విక్రయించాలని ప్లాన్ చేశారు. వీరు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డిపిఎస్ కేసుల్లో ప్రమేయం ఉన్నారని పోలీసులు తెలిపారు. వైజాగ్కు చెందిన సుధీర్ సాహూ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.