రాష్ట్రంలో కలకలం రేపుతోన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీక్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిగా టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ను ఈ కేసులో పోలీసులు చేర్చారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ కార్యదర్శి పీఏగా అతడు పనిచేస్తున్నాడు. అలాగే ఉద్యోగి రాజశేఖర్ను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.