తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో కొత్తగా 923 కేసులు నమోదయ్యాయి . హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 366 కేసులు నమోదవగా, పొరుగున ఉన్న రంగారెడ్డి (79), మేడ్చల్ మల్కాజిగిరి (59) జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
739 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8,09,009గా ఉందని ఆరోగ్య శాఖ బులెటిన్ లో తెలిపింది. రికవరీ రేటు 98.87 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం మరణాల సంఖ్య 4,111గా ఉంది. గడిచిన 24 గంటల్లో 40,593 నమూనాలను పరీక్షించినట్లు బులెటిన్లో పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,170గా ఉన్నాయిజ