Kumari Aunty: పాపం కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ క్లోజ్.. అండగా నిలబడిన హీరో?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా సాయి కుమారి ఆంటీ పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా యూట్యూబ్ లో అ

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 08:00 AM IST

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా సాయి కుమారి ఆంటీ పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా యూట్యూబ్ లో అయితే ఈమెకు సంబంధించిన వీడియోల ట్రెండింగ్ అవుతున్నాయి. మాదాపూర్‌లోని ఐటీసీ కోహీనూర్‌ హోటల్‌ సమీపంలో స్ట్రీట్‌ ఫుడ్ బిజినెస్‌ చేస్తోన్న ఆమె గత కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇంకో రోజుకు లక్షల్లో వ్యాపారం జరుగుతోందని అంతేకాకుండా రోజురోజుకీ ఫుడ్ ధరలు పెంచేస్తోందని, అయినప్పటికీ ఆమె దగ్గరకు సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ వస్తున్నారంటూ యూట్యూబ్స్ లో ఇంస్టాగ్రామ్ లలో నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఆమెపై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా ఇక బిగ్‌బాస్‌ రాబోయే సీజన్‌లోనూ కుమారి ఆంటీ కనిపిస్తారంటూ కథనాలు కూడా అల్లేశాయి. ఇలా గత కొన్ని రోజులుగా నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్న కుమారీ ఆంటీ ఇప్పుడు కష్టాల్లో పడింది. చుట్టు పక్కల ప్రాంతాల్లోని యువత ఎక్కువగా కుమారీ ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడడంతో రద్దీ ఎక్కువైపోతుంది. ఈ ఫుడ్‌ స్టాల్‌కు వచ్చిన వారు రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందంటూ పోలీసులు కుమారీ ఆంటీపై కేసు కూడా నమోదు చేశారు. అంతేకాదు ఆమె బిజినెస్‌ను క్లోజ్‌ చేయించారు. దీనిపై కుమారీ ఆంటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఇదే విషయంపై టాలీవుడ్‌ ప్రముఖ హీరో సందీప్‌ కిషన్‌ స్పందించారు.

 

సొంతంగా వ్యాపారం చేసి కుటుంబానికి అండగా నిలవాలనుకునే వారికి ఆమె ఆదర్శం. ఈ మధ్య కాలంలో నేను చూసిన బలమైన మహిళా సాధికారిత ఉదాహరణల్లో ఇది కూడా ఒకటి. నేను, నా టీమ్‌ తరఫున సాధ్యమైనంతవరకు ఆమెకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తాము అని సందీప్‌ కిషన్‌ ట్వీట్‌ చేశారు. అదేవిధంగా కుమారీ ఆంటీ బిజినెస్‌ క్లోజ్‌ చేయించడంపై ట్రాఫిక్‌ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ మార్గంలో స్ట్రీట్‌ ఫుడ్‌ బిజినెస్‌కు ఎలాంటి అనుమతులు లేవు. ఇది వీరి సొంత స్థలం కాదు. ఈ బిజినెస్‌ కారణంగా చాలా కాలంగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఇక్కడకు వచ్చే వందమంది కారణంగా వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే చర్యలు తీసుకోక తప్పలేదు అని స్థానిక ట్రాఫిక్‌ పోలీస్‌ ఒకరు చెప్పుకొచ్చారు. మరి కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ క్లోజ్ అయినట్టేనా లేదంటే మళ్లీ రీ ఓపెన్ అవుతుందా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.