తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. చిట్యాల బ్లాక్ వెలిమినేడు గ్రామంలోని హిండీస్ ల్యాబ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ప్లాంట్లో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది ప్లాంట్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుడు సమయంలో ఒక్కసారిగా ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ప్లాంట్ సమీపంలోని నివాస ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా భయాందోళనలకు గురయ్యారు.