Site icon HashtagU Telugu

Telangana: నవంబర్ 1న కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొననున్న రాహుల్, ప్రియాంక

World Cup 2023 (70)

World Cup 2023 (70)

Telangana: తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. అక్టోబర్ 31, నవంబర్ 1న తెలంగాణలో ప్రచారంలో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో ప్రసంగించడంతో పాటు షాద్ నగర్ రైల్వేస్టేషన్ నుంచి షాద్ నగర్ చౌరస్తా వరకు పాదయాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణకు పార్టీ ప్రకటించిన ఆరు హామీలపై కొల్లాపూర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ దేవరకద్రలో మహిళలతో మాట్లాడనున్నారు. అంతకుముందు తెలంగాణలో పర్యటించిన రాహుల్, ప్రియాంక గాంధీలు ములుగు సభలో ప్రసంగించారు. ఈ క్రమంలో అధికార పార్టీ బీఆర్ఎస్ లో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తలపెట్టిన విజయభేరి బస్సు యాత్రలో పాల్గొన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శలు చేశారు . కర్ణాటక వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను చూడాలని కోరారు. మరోవైపు పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే ఆదివారం రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించారు.

Also Read: NTR : గోవాలో దేవర.. ఎన్టీఆర్ సినిమా ఏం జరుగుతుంది..?