IPL 2022: హోరా హోరీ పోరులో గెలిచేది ఎవరు ?

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ మరో హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. ముంబైలోని బ్రబౌర్న్ మైదానం వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీపడనున్నాయి.

  • Written By:
  • Updated On - April 8, 2022 / 12:56 PM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ మరో హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. ముంబైలోని బ్రబౌర్న్ మైదానం వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీపడనున్నాయి. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు మరి విజయం కోసం ఉవ్విళ్లరుతోందీ. ఇక మరోవైపు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో రెండింట్లో గెలిచి జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాల్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. హార్దిక్ పాండ్య సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ తుది జట్టుని పరిశీలిస్తే.. శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్ ఓపెనర్లుగా రానుండగా.. మూడో స్థానంలో విజయ్ శంకర్ మిడిల్ ఆర్డర్ లో హార్దిక్ పాండ్య , డేవిడ్ మిల్లర్ లోయర్ ఆర్డర్ లో రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్ బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ విషయానికొస్తే.. రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ,వరుణ్ ఆరోన్ దుమ్మురేపేందుకు సిద్ధంగా ఉన్నారు..
అలాగే ఈ మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ తుది జట్టుని పరిశీలిస్తే..శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్,  ఓపెనర్లుగా రానుండగా .. మూడో స్థానంలో జానీ బెయిర్ స్టో, మిడిల్ ఆర్డర్ లోజితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టన్ లోయర్ ఆర్డర్ లో షారూఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్ బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్ విభాగంలో కగిసో రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా కీలకం కానున్నారు. ఈ మ్యాచ్ జరగనున్న బ్రబౌర్న్ పిచ్ మీద ఛేదనకు దిగిన జట్లే వరుసగా విజయం సాధిస్తుండగా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంటుంది అని చెప్పొచ్చు.. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఫేవరేట్ గా భావిస్తున్నారు.