Polling ended peacefully in Telangana తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పోలింగ్ డే వచ్చేసింది. తెలంగాణ ప్రజలు తమ 5 ఏళ్ల భవిష్యత్తును నిర్దేశించుకునే రోజు ఇది. తాజాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో మొదలయ్యాయి. కావా పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. రాష్ట్రంలోని 13 సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రం పోలింగ్ ఒక గంట ముందుగా అంటే సాయంత్రం 4గంటలకే ముగిసింది.
119 నియోజకవర్గాలకు గాను 2,290 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషుల ఓట్లు 1,62,98,418 ఉంది. మహిళా ఓటర్లు 1,63,01,705 మంది ఉన్నారు. అయితే మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్ ప్రశాంతంగా జరిపేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకున్నారు అధికారులు.
అత్యధికంగా LB నగర్ నియోజకవర్గంలో 48 మంది పోటీ చేస్తుండగా అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడలో ఏడుగురు చొప్పున బరిలో ఉన్నారు. ఇక ఈ తాజాగా ఎన్నికలు ఎటువంటి హంగామాలు గొడవలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి.
సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగిసేసరికి 63.94 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
We’re now on WhatsApp : Click to Join