AP Govt: ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ‌లో పోస్టుల భ‌ర్తీకి ఉత్త‌ర్వులు జారీ

వైద్య, ఆరోగ్య శాఖల్లో వైద్యులు, వైద్య, వైద్యేతర సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే భారీ నియామకాలు చేపట్టి చేపడుతున్న సంగతి తెలిసిందే.

  • Written By:
  • Updated On - February 15, 2022 / 03:34 PM IST

వైద్య, ఆరోగ్య శాఖల్లో వైద్యులు, వైద్య, వైద్యేతర సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే భారీ నియామకాలు చేపట్టి చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ వైద్య విధాన మండలిలో మరో 2,588 పోస్టులను సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ పంపిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం పోస్టులు సృష్టించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా కొత్తగా సృష్టించిన పోస్టుల్లో డాక్టర్లు 485, నర్సింగ్ 60, ఫార్మసీ 78, పారామెడికల్ క్లాస్-4 644, ల్యాబ్ టెక్నీషియన్ 279, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 39, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 54, ఇతర పోస్టులు 949. . వీటిలో చాలా పోస్టులు డైరెక్ట్, పర్మినెంట్, కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రక్రియ ద్వారా భర్తీ చేయబడతాయి, మరికొన్ని పోస్టులు పదోన్నతి పొందుతాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య, ఆరోగ్య శాఖల్లో 39 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. వీటిలో ఇప్పటికే 27 వేల పోస్టులను భర్తీ చేయగా మిగిలినవి ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. అదే సమయంలో మరో 2,588 పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు చేయడం ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు అద్దం పడుతోంది.