ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా పేరున్న ముంబై ఇండియన్స్ 15వ సీజన్ లో మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తోంది. వరుసగా ఆరు మ్యాచ్ లలో పరాజయం పాలైంది. సీజన్ ఆరంభం నుంచే ఆ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు.
అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సమష్టిగా విఫలమవుతూ పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో నిలిచింది. ఐదుసార్లు ఐపీఎల్లో టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఇలా వరుస ఓటములు చెందడం ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకూ ఈ సీజన్ లో గెలుపు రుచి చూడని జట్టు ముంబై మాత్రమే. ఐపీఎల్ 2014 సీజన్లో వరుసగా ఐదు ఓటములు ఎదురైనప్పటికి.. ఆరో మ్యాచ్లో విజయం సాధించి.. ఆ తర్వాత టైటిల్ విజేతగా నిలిచింది. కానీ ఈసారి అలాంటి అద్బుతమేమి జరగలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇక ముంబై ఇండియన్స్ పుంజుకోవడం కష్టమేనని అంచనా వేస్తున్నారు. ఈ సారి ముంబై ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందా అన్న ప్రశ్న అందరిలోనూ నెలకొంది. ప్రస్తుత ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్కు అర్హత సాధించడం కష్టమేనని చెప్పొచ్చు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో మరో 8 లీగ్ మ్యాచ్లు ఆడనుంది. 8 మ్యాచ్ల్లోనూ విజయం సాధిస్తానే ముంబై ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. ఇప్పుడున్నా పరిస్థితుల్లో ముంబై వరుసగా 8 మ్యాచులు గెలవడం అంత సులభం కాదు. ఈ క్రమంలో ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తొలి జట్టుగా ముంబై నిలువనుంది. ఇక ఐపీఎల్ 15వ సీజన్ పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, మొదటి 4 స్థానాల్లో నిలిచాయి.