IndiGo Aircraft: బెంగళూరు నుంచి అహ్మదాబాద్కు వస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ (IndiGo Aircraft) విమానం గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా తోక భాగం భూమిని ఢీకొట్టింది. గత ఐదు రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారి ఒకరు తెలిపారు. సమాచారం ప్రకారం.. ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో విమానం వెనుక భాగం రన్వేని ఢీకొన్నప్పుడు దానిని టెయిల్ స్ట్రైక్ అంటారు.
ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది
ఈ విమానం పైలట్లను ఎగరకుండా నిషేధించాలని DGCA ఆదేశించినట్లు అధికారి తెలిపారు. అధికారి మాట్లాడుతూ.. విమానం టెయిల్ ఎండ్ భూమిని తాకినట్లు నివేదించబడింది. పైలట్లు విమాన ప్రయాణంపై నిషేధం విధిస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు కూడా ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటనతో ప్రయాణికులు కాసేపు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆధికారులు తెలిపారు.
ఒక ప్రకటనలో ఇండిగో ఈ సంఘటనను ధృవీకరించింది. విమానాన్ని తనిఖీ చేస్తోంది. ఆ ప్రకటనలో.. ఇండిగో ఫ్లైట్ నంబర్ 6E6595 బెంగళూరు నుండి అహ్మదాబాద్కి రాగానే విమానం వెనుక భాగం నేలను తాకింది. అవసరమైన తనిఖీలు, మరమ్మతుల కోసం విమానం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నిలిచిపోయింది. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరుపుతున్నారని పేర్కొంది. అంతకుముందు జూన్ 11న కోల్కతా నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో ఎయిర్బస్ ఏ321 విమానం వెనుక భాగం నేలను తాకింది. ఈ ఘటన తర్వాత పైలట్లను విమానయానం చేయకుండా ఆపాలని డిజిసిఎ ఇండిగోను ఆదేశించింది.