H3N2 Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న H3N2 వైరస్.. మరొకరు మృతి !

దేశంలో ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెంజా H3N2 వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకూ ముగ్గురు మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో మూడో మరణం చోటుచేసుకుంది.

  • Written By:
  • Publish Date - March 14, 2023 / 07:38 PM IST

H3N2 Virus: దేశంలో ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెంజా H3N2 వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకూ ముగ్గురు మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో మూడో మరణం చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ 58 ఏళ్ల మహిళ మృతి చెందింది. వైద్యుల ప్రకారం మహిళ ఇప్పటికే అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతోంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న రోగికి.. వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తున్నారు.

ఈ వైరస్ కారణంగా హర్యానా, కర్ణాటకలో ఇప్పటికే ఇద్దరు రోగులు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెంజా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వైద్యుల ప్రకారం H3N2 వైరస్ A ఉప రకం. ఈ వైరల్ ప్రస్తుతం చురుకుగా మారింది. చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌తో బాధపడేవారిలో జలుబు, బాడీ పెయిన్స్ ప్రధాన లక్షణాలు అయితే ఆ వైరస్ క్రమంగా రోగి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది.

ఐదేళ్ల లోపు పిల్లలు, గర్భిణులు, వృద్ధులు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్‌తో బాధపడుతున్న రోగులకు సకాలంలో వైద్యం అందకపోతే.. బాధితుల ప్రాణాలు కూడా పోతాయి. సరైన సమయంలో వైద్య చికిత్స అందించాలి. చికిత్స అందించే విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. H3N2 వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే రోగిని ఆసుపత్రికి తరలించి తగిన చికిత్సనందించాలి.

డాక్టర్ అరుణ్ షా ప్రకారం.. ఫ్లూ వ్యాక్సిన్ H3N2 వైరస్‌ను నివారించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ టీకా శరీరంలో రోగనిరోధక శక్తిని తయారు చేస్తుంది. బలహీనమైన పిల్లలు, రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలు, వృద్ధులకు వ్యాధితో పోరాడడంలో టీకా సహాయపడుతుందని అరుణ్ షా పేర్కొన్నారు. మరికొన్ని రోజుల పాటు ఈ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని డాక్టర్ షా అభిప్రాయపడ్డారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.