TCongress: ఆ లోక్ సభ స్థానం కోసం స్థానికుల పట్టు, టీకాంగ్రెస్ ఎవరికి ఛాన్స్ ఇస్తుందో

  • Written By:
  • Updated On - February 15, 2024 / 12:12 AM IST

TCongress: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రధాన పార్టీలకు కష్టంగా మారింది. పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఈసారి స్థానికులనే పోటీకి దింపాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అన్ని పార్టీల నుంచి స్థానికేతర అభ్యర్థులే పోటీకి దిగుతున్నారు. అర్హత, అనుభవం ఉన్నప్పటికీ ఇక్కడి అభ్యర్థులకు అవకాశం లభించడం లేదు. కారణాలు ఏవైనా దాదాపు అన్ని పార్టీలు బయటి అభ్యర్థులకే ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాయి. దీంతో స్థానికులకు అవకాశం దకడం లేదన్న అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తెలంగాణ వచ్చాక రెండుసార్లు అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి కూడా బయటి అభ్యర్థులకే ప్రాధాన్యత ఇచ్చింది. కాంగ్రెస్ కూడా స్థానికేతర అభ్యర్థిని గతంలో రంగంలోకి సంఘంలోకి దించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగుదేశం పార్టీ స్థానికేతర అభ్యర్థులను రంగంలోకి దించింది. విజయం సాధించినవారు ఎవరు కూడా ఈ నియోజకవర్గ మీద దృష్టి పెట్టలేదని, అభివృద్ధి మీద అంతగా శ్రద్ధ చూపలేదని విమర్శలు ఉన్నాయి.

గతంలో ఇక్కడి నుంచి ఏ పార్టీ నుంచి అయినా ఈ నియోజకవర్గ మీద అంతగా శ్రద్ధ చూపలేదని ఆవేదన ఈ ప్రాంత వాసులలో ఉంది. స్థానికులకే అవకాశం దక్కి వారే ఎంపీగా గెలుపొందితే ఇక్కడ అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెడతారని స్థానికులు భావిస్తున్నారు. అందుకు తగినట్టుగా ఇక్కడ అర్హత అనుభవం కలిగిన అభ్యర్థులు కూడా దాదాపు అన్ని పార్టీలలో ఉన్నారు. గతంలో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ ఎంపీగా గెలుపొందిన నేత ఇప్పుడు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఓ మహిళా నేత ఇంతకాలం విదేశాలలో ఉండి ఇప్పుడు మళ్లీ రంగ ప్రవేశం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఈ లొక్ సభ స్థానం పరిధిలోని నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇప్పుడు మళ్లీ అదే కుటుంబానికి చెందిన వ్యక్తికి ఎంపీ టికెట్ కాంగ్రెస్ నుంచి ఆశిస్తున్నట్టుగా సమాచారం. ఇంతకుముందు కూడా ఈ కుటుంబం నుంచి ఇద్దరు ఇక్కడ నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఒకరు కేంద్రమంత్రిగాను పనిచేశారు ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత వచ్చిన వారెవరు ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద చూపలేదు. పైగా పెద్దపల్లి నియోజకవర్గం రాజకీయ ప్రయోగశాలగా, రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. 2009లో ఈ నియోజకవర్గానికి చెందిన ఆసంపల్లి శ్రీనివాస్ లాంటివారు ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏ పదవులు ఆశించకుండా నిస్వార్థంగా పార్టీకి సేవలు చేసుకుంటూ వచ్చారు. శ్రీనివాస్ ఏ కాకుండా ఇంకా చాలామంది స్థానిక నేతలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు అండదండలు అందించినవారు ఉన్నారు. అలాంటి వారంతా ఇప్పుడు గుర్తింపును కోరుకుంటున్నారు.