పట్టాలు దాటుతున్న గుర్తుతెలియని వృద్ధుడిని (Elderly Person Killed) ప్యాసింజర్ రైలు ఢీ కొట్టిన ఘటన .. బీబీనగర్-ఘట్కేసర్ మధ్య చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ క్రమంలో రైలు ఇంజిన్ ముందు భాగంలో చిక్కుకున్న మృతదేహం.. ఘట్కేసర్ వరకు సుమారు 5 కి.మీ వేలాడుతూ వచ్చింది. రైలుకు వేలాడుతూ వచ్చిన మృతదేహం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ దృశాన్ని ఘటకేసర్ (Ghatkesar)లోని రైల్వే గేటు వద్ద వాహనాదారులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ట్రైన్ ఆపి మృతదేహాన్ని బయటకు తీశారు.
We’re now on WhatsApp. Click to Join.
బీబీనగర్-ఘటకేసర్ రైల్వేస్టేషన్ మధ్య ఓ గుర్తుతెలియని వృద్ధుడు పట్టాలు దాటుతుండగా వరంగల్ వైపు నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొట్టినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో వృద్ధుడు రైలు ముందు భాగానికి చిక్కుకొని సుమారు ఐదు కిలోమీటర్ల మేరకు అలాగే వేలాడుతూ వచ్చింది. మృతిచెందిన వృద్ధుడు నీలం రంగు చొక్కా, ఆరెంజ్ లుంగీ, కుడిచేతికి కడియం ధరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
Read Also : IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం.. బీసీసీఐ ముందు కీలక డిమాండ్!