Ganja: రెండు కేజీల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు

  • Written By:
  • Publish Date - April 20, 2024 / 01:31 PM IST

Ganja: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న గంజాయి సరఫరాకు బ్రేక్ పడటం లేదు. తాజాగా మరోసారి పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. SOT బాలానగర్ టీమ్, సనత్‌నగర్‌ పోలీసులు సంయుక్తంగా సనత్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని ఎర్రగడ్డ భరత్‌నగర్‌ ఫ్లై ఓవర్‌ వద్ద తనిఖీలు నిర్వహించారు. బచ్చల లోకేష్ అనే శ్రీకాకులానికి చెందిన యువకుడిని పట్టుకుని అతని వద్ద నుండి రూ.57,500/- విలువ గల 2.3 కేజీల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో అతను ఏపీలోని శ్రీకాకుళం కు చెందిన వాడని, జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి మోతీనగర్‌లో నివాసం ఉంటూ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడని, గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉన్నందున హైదరాబాద్‌కు లో గంజాయిని అమ్ముకుని ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని భావించాడు.

కొద్ది రోజుల ముందు AP లోని ఇచ్ఛాపురం వెళ్లి అక్కడ గంజాయిని సరఫరా చేస్తున్న నరేష్ నుండి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఇక్కడ కూలీలకు మరియు నిర్మాణ రంగం లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన యువకులకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పోలీసులు తనిఖీలు చేయడంతో పట్టుబడ్డాడు.